AP Government: HMPVపై ఏపీ సర్కార్ అలెర్ట్.. సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
- HMPVపై సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్..
- టెలీ కాన్ఫెరెన్స్లో పాల్గొన్న ఉన్నతాధికారులు..
- ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు..
- వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని..
- అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో వెలుగు చూసిన ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. భారత్లో అధికారికంగా HMPV మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. గైడ్లైన్స్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్ళపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్ధేశించారు. ఈ కాన్ఫరెన్స్లో మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు..
Read Also: Mahesh Babu : సోనూసూద్కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
మరోవైపు.. HMPV వైరస్ పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. విశాఖ నుంచి నిపుణులైన వైద్యులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. కర్ణాటకలో నమోదైన HMPV కేసులపై అప్రమత్తం అయ్యాం.. HMPV పై అలార్మింగ్ వాతావరణం లేదు.. సాధారణ ఫ్లూ లక్షణాలతో ఇబ్బంది పెడుతుంది.. మరణాలు కూడా నమోదైన సమాచారం లేదన్నారు.. వైద్యశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాటు చేస్తున్నాం.. ప్రతీ హాస్పిటల్ లో 20 బెడ్స్ ను HMPV కోసం ఐసోలేట్ చేయమని ఆదేశించాం అన్నారు.. HMPV పై SOP విడుదల చేస్తున్నాం.. ICMR ఇప్పటివరకు జనరల్ అడ్వైజరీ మాత్రమే ఇచ్చింది.. పెద్దగా ఆందోళన అవసరం లేదు, ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అయినా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!