AP Government: HMPVపై ఏపీ సర్కార్ అలెర్ట్.. సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్..
- HMPVపై సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్..
- టెలీ కాన్ఫెరెన్స్లో పాల్గొన్న ఉన్నతాధికారులు..
- ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు..
- వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని..
- అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో వెలుగు చూసిన ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. భారత్లో అధికారికంగా HMPV మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ.. గైడ్లైన్స్ విడుదల చేసిన విషయం విదితమే కాగా.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి వెళ్లే వాళ్ళపై దృష్టి పెట్టాలని, ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్ధేశించారు. ఈ కాన్ఫరెన్స్లో మంత్రి సత్యకుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది.. ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేశారనే వివరాలను సీఎం చంద్రబాబుకు వివరించారు అధికారులు..
Read Also: Mahesh Babu : సోనూసూద్కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
మరోవైపు.. HMPV వైరస్ పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. విశాఖ నుంచి నిపుణులైన వైద్యులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. కర్ణాటకలో నమోదైన HMPV కేసులపై అప్రమత్తం అయ్యాం.. HMPV పై అలార్మింగ్ వాతావరణం లేదు.. సాధారణ ఫ్లూ లక్షణాలతో ఇబ్బంది పెడుతుంది.. మరణాలు కూడా నమోదైన సమాచారం లేదన్నారు.. వైద్యశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాటు చేస్తున్నాం.. ప్రతీ హాస్పిటల్ లో 20 బెడ్స్ ను HMPV కోసం ఐసోలేట్ చేయమని ఆదేశించాం అన్నారు.. HMPV పై SOP విడుదల చేస్తున్నాం.. ICMR ఇప్పటివరకు జనరల్ అడ్వైజరీ మాత్రమే ఇచ్చింది.. పెద్దగా ఆందోళన అవసరం లేదు, ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అయినా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
-
Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!