CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్ అయ్యింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Serious Warning: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. దాదాపు 3 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. కేంద్రానికి, ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతో పాటు.. కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్.. అయితే, ఎజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం చంద్రబాబు.. కీలక సమాచారం లీక్ అవుతున్న అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ అజెండాతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ముందుగానే బయటకు ఎలా వస్తున్నాయంటూ మంత్రులను ప్రశ్నించారు. ఇకపై క్యాబినెట్ సమావేశానికి ముందే ఎజెండా లీకైతే సంబంధిత మంత్రులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. గతంలో ఇలాంటి లీకుల కారణంగా ఎన్టీఆర్ తన కేబినెట్ను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Also Read
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
అదేవిధంగా, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా సీఎం మంత్రులకు పలు సూచనలు చేశారు. ‘జలధార’ పథకం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. పాస్బుక్స్ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు, సంబంధిత మంత్రులు నెలకు కనీసం నాలుగు సార్లు ప్రాంతాల వారీగా పర్యటించాలని ఆదేశించారు. ‘సూర్య ఘర్’ పథకంపై మరింత దృష్టి పెట్టాలని, వచ్చే ఏడాదితో ముగియనున్న లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని మంత్రులకు నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే మహిళా బిల్లుపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ఇక, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తంగా, ఏపీ కేబినెట్లో లీకుల అంశంపై సీఎం చంద్రబాబు గట్టి హెచ్చరిక జారీ చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాల అమలుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
-
Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
-
Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
-
SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
-
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!