CM Chandrababu: వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్.. దావోస్లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు..
- ఒకే వేదికపై ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలు..
- వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్..
- మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ఉద్దేశించి బాబు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: దావోస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్ అంటూ.. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తున్నారు భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ వెళ్లి.. వివిధ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమై.. తమ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు.. తమ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికసదుపాయాలు వివరిస్తూ.. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు.. అయితే, దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు..
Read Also: Minister Nara Lokesh: దావోస్లో బిజీబిజీ.. లోకేష్ వరుస భేటీలు
Also Read
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
ఇక, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రాగా.. గ్లోబల్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడం.. రాష్ట్రాల ఆకాంక్ష ఏ విధంగా ఉంది అనే అంశాలపై చర్చించారు.. అయితే, ఈ కార్యక్రమంలో ఓ ప్రశ్నకు బదులిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు.. వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్ అంటూ.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని చూయిస్తూ కామెంట్లు చేశారు.. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. తెలంగాణ స్టేట్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ఇండియా అని పేర్కొన్న చంద్రబాబు.. వాళ్లు వెరీ రిచ్.. మేం వెరీ పూర్ అంటూ చమత్కరించారు.. దీంతో, ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి..
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!