YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: డీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా నియామకాల వరకు జరిగిన ప్రతి అంశంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు..
ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) లో స్పందించిన వైఎస్ జగన్, డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో జరిగిన ర్యాలీలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై నేటి జెన్-జీ (Gen-Z) యువత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని జగన్ అన్నారు. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించాల్సిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం రోడ్డెక్కించిందని విమర్శించారు.
Also Read
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
టీచర్ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమైన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, డీఎస్సీ పేపర్ లీకేజీలు, అక్రమాలతో వారి భవిష్యత్తును దెబ్బతీసిందని జగన్ ఆరోపించారు. డీఎస్సీ పరీక్షలపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు ప్రజల ముందే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు.
ఈ అంశాన్ని డైవర్షన్ రాజకీయాలతో కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని కూడా ఆరోపించారు వైఎస్ జగన్.. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపబోమని, యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి యువకుడు, విద్యార్థికి జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారి హక్కుల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన… pic.twitter.com/C0ZpLL2hC3
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026
తాజావార్తలు
-
Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!