Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
- త్వరలో ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..
- ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plastic Notes: దేశంలో త్వరలో రూ.10, రూ.20 విలువైన పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు పార్లమెంట్లో వెల్లడైంది. తొలి దశలో ఈ నోట్లను ఫీల్డ్ ట్రయల్ కోసం విడుదల చేసి, ప్రయోగం విజయవంతమైతే క్రమంగా సాధారణ చలామణిలోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రూ.10, రూ.20 విలువైన 100 కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ముద్రించి ప్రయోగాత్మకంగా విడుదల చేయనున్నారు. ఈ ట్రయల్ ఫలితాలను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు కొనసాగుతాయని, వాటిని పూర్తిగా ప్లాస్టిక్ నోట్లతో భర్తీ చేసే ప్రతిపాదన ఇప్పటివరకు లేదని పేర్కొంది. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, నకిలీ నోట్లు తయారు చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. దీంతో దీర్ఘకాలంలో ముద్రణ వ్యయాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉండగా, భవిష్యత్తులో డిజిటల్ చెల్లింపులపై దీని ప్రభావాన్ని కూడా అంచనా వేయనున్నారు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రపంచంలో తొలిసారిగా 1988లో ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 50కి పైగా దేశాలు పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఆర్బీఐ ఈ ప్రాజెక్టుకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినట్లు కూడా సమాచారం. దీంతో భారత్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి రావడానికి మార్గం సుగమమవుతోంది.
Also Read
- Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
తాజావార్తలు
-
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
-
Gen-z Viral Video: మేము “జెన్-జీ” ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
-
Delhi CNG Blast: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. సీఎన్జీ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
-
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!