Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
- ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్?
- మీడియాలో కథనాలు
- క్లారిటీ ఇచ్చిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు రాజీనామా తర్వాత మరో కేంద్ర మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని మీడియా ఛానల్స్లో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా కల్పిత కథనాలేనని స్పష్టం చేసింది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్కు మరో కేబినెట్ పదవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ వార్తలకు ఎలాంటి ఆధారం లేదని.. అవి పూర్తిగా కల్పితం, నిరాధారమైన ప్రచారం అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర నెలకు పైగా ఆందోళనలు నిర్వహిస్తున్న సీజేపీ ప్రధాన డిమాండ్ కూడా ఆయన రాజీనామానే. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, సీజేపీ మధ్య జరిగిన చర్చలు కూడా ఫలితం లేకుండా ముగిశాయి. రాజీనామా అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘గత 10 రోజుల పరిణామాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువతే ఈ దేశానికి అసలైన శక్తి.’’ అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు, దేశ వ్యతిరేక శక్తులు ఉద్యమాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకే తాను రాజీనామా చేసినట్లు వివరించారు.
బీజేపీ ఖండన
కొన్ని మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్కు మరో కీలక మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినప్పటికీ ఆయన తిరస్కరించారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ జరగలేదని బీజేపీ స్పష్టంగా తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై నిరాధార ఊహాగానాలు చేయవద్దని సూచించిన బీజేపీ.. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ పరీక్షల విశ్వసనీయతను పెంచడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
ఇదే సమయంలో దేశంలోని ప్రభుత్వ పరీక్షల వ్యవస్థను పూర్తిగా సంస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరీక్షల భద్రత, పారదర్శకత, సైబర్ సెక్యూరిటీ, అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణ, డేటా రక్షణ, ప్రశ్నాపత్రాల లీకేజీలను ముందుగానే గుర్తించే సాంకేతిక వ్యవస్థలపై సూచనలు ఇవ్వనుంది. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టంలో సవరణలు తీసుకువచ్చి, ప్రశ్నాపత్రాల లీక్ ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?