AP Assembly Session: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
- రేపటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..
- రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం..
- 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం..
- అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Session: రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి… రేపు ఉదయం 9 గంటలకు శాసన సభ… 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి… సభ ఎన్ని రోజులు జరగాలి.. అనే అంశంపై బీఏసీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభం అవుతుంది… అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది…. అసెంబ్లీ సమావేశాలు నిర్మాణకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. సీఎస్, డీజీపీలతో కీలక సమీక్ష చేశారు అయ్యన్న పాత్రుడు… పోలీస్ యంత్రాంగం ఎక్కడెక్కడ ఉండాలి విధుల నిర్వహణ పై చర్చించారు… ఒక వారం రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.. కాబట్టి దానికి సంబంధించి భద్రత వ్యవహారం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు డీజీపీకి సూచించారు.
Read Also: 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేతో Oppo K13s వచ్చేసిందోచ్!
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది.. అసెంబ్లీ సమావేశాలు.. ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనే అంశం పై నిర్ణయం తీసుకోనున్నారు… అసెంబ్లీ కి వైసీపీ ఎమ్మెల్యే లు హాజరయ్యే పరిస్థితి లేదు.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ చెబుతోంది.. గతంలో మాదిరిగానే కేవలం మండలి సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు.. ఇక, అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని.. లేకపోతే ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చెయ్యాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి… స్పీకర్.. ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రావాలని చెబుతున్నారు… దీంతో రేపు ఎంతమంది హాజరు అవుతారు అనేది కూడా హాట్ టాపిక్ అయింది.
ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలక ఆర్డినెన్స్ లు ప్రవేశ పెట్టనున్నారు. పంచాయితీ. రాజ్.. మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్ లు సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో పాటు నాలా చట్ట సవరణ.. షెడ్యూల్ సబ్ క్యాస్ట్… ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్ లను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం… వీటిని బిల్ రూపంలో తీసుకొచ్చిన తర్వాత… చట్టం చేయనుంది ప్రభుత్వం.. రేపటి కేబినెట్ సమావేశంలో మరికొన్ని బిల్లులు ఆమోదించి… అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!