IND vs AFG U19: అదేం కొట్టుడు స్వామి.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా!
- అండర్-19 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భారత్ ఘన విజయం
- ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని 41.1 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
- కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో విజయం..
IND vs AFG U19: హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ లో భారత అండర్-19 జట్టు విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన భారీ 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది.
Elon Musk: లారీ పేజ్ను అధిగమించి.. $800 బిలియన్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ఇక మ్యాచ్ విశ్శ్యానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్ లో ఫైసల్ షినోజాదా 93 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరోవైపు అతనికి తోడుగా ఉజైరుల్లా నియాజై 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేసి టీమిండియా బౌలర్లు కు పరీక్షగా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో రెండు వికెట్లు తీశారు.
New Electricity Connections: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో కీలక మార్పులు.. రేపటి నుండి అమలు!
ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. టీమిండియా డైనమేట్ వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ వైపు పూర్తిగా తిప్పేశాడు. ఆ తర్వాత ఆరన్ జార్జ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి సెంచరీ బాదాడు. ఇక అతనికి తోడుగా కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కూడా 59 బంతుల్లో 62 పరుగులు చేసి విజయానికి సహకరించాడు. చివర్లో విహాన్ మల్హోత్రా అజేయంగా 38 పరుగులతో మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో టీమిండియా అండర్-19 జట్టు వరల్డ్ కప్ ఫైనల్కు అర్హత సాధించింది. ఫైనల్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో అమితుమీ తేల్చుకోనుంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?