IND vs AFG U19: అదేం కొట్టుడు స్వామి.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా!
- అండర్-19 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భారత్ ఘన విజయం
- ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని 41.1 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
- కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG U19: హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ లో భారత అండర్-19 జట్టు విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన భారీ 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది.
Elon Musk: లారీ పేజ్ను అధిగమించి.. $800 బిలియన్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద
Also Read
- Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ఇక మ్యాచ్ విశ్శ్యానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్ లో ఫైసల్ షినోజాదా 93 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరోవైపు అతనికి తోడుగా ఉజైరుల్లా నియాజై 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేసి టీమిండియా బౌలర్లు కు పరీక్షగా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో రెండు వికెట్లు తీశారు.
New Electricity Connections: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో కీలక మార్పులు.. రేపటి నుండి అమలు!
ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. టీమిండియా డైనమేట్ వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ వైపు పూర్తిగా తిప్పేశాడు. ఆ తర్వాత ఆరన్ జార్జ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి సెంచరీ బాదాడు. ఇక అతనికి తోడుగా కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కూడా 59 బంతుల్లో 62 పరుగులు చేసి విజయానికి సహకరించాడు. చివర్లో విహాన్ మల్హోత్రా అజేయంగా 38 పరుగులతో మ్యాచ్ను ముగించాడు. ఈ విజయంతో టీమిండియా అండర్-19 జట్టు వరల్డ్ కప్ ఫైనల్కు అర్హత సాధించింది. ఫైనల్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో అమితుమీ తేల్చుకోనుంది.
తాజావార్తలు
-
Specific Carbohydrate Diet for Gut Health: పేగుల సమస్యలకు డైట్ థెరపీ.. వైద్యులు ఏమంటున్నారు?
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!