AP Aqua Farmers: ఆక్వా రైతుల కోసం సర్కార్ కీలక నిర్ణయం..
- ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ లో కొత్త నిర్ణయం..
- AP PPC అనే కంపెనీ ఏర్పాటు..
- ఆక్వా రైతులకు, ఆక్వా కంపెనీలకు కావాల్సిన అన్ని సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Aqua Farmers: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ లో కొత్త నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… AP PPC అనే కంపెనీ ఏర్పాటు చేసి, ఆక్వా రైతులకు, ఆక్వా కంపెనీలకు కావాల్సిన అన్ని సేవలు అందించనుంది.. అలాగే, ఫీడ్ ధరలో 14 రూపాయలు MRP మీద అందరికీ సమానంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. విద్యుత్ టారిఫ్ తగ్గించడం ద్వారా ఆక్వా రైతులకు భారం తగ్గించాలని నిర్ణయించారు.. స్ధానిక మార్కెట్ను పెంచడానికి, రొయ్యల వినియోగం పెంచడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుంది.. APPPC కోసం ఒక వెబ్ సైట్ సిద్ధం చేసారు.. దీనిని APP రూపంలో త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది… ఈ అంశాలపై ఏపీ డిప్యుటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మీడియా సమావేశంలో పూర్తి సమాచారం అందించారు.
Read Also: Jyoti Malhotra: ‘గూఢచారి’ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బెయిల్ తిరస్కరణ..
Also Read
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
- YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
పాలసీ మార్పులపై, కొత్త కంపెనీ ఏర్పాటుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ.. 3 నెలల క్రితం ఆక్వా పరిశ్రమకు సంక్షోభం వచ్చింది.. ఫిషరీస్ డిపార్ట్మెంట్, APSADA కలిసి పలు సమావేశాలు నిర్వహించాయి.. 4 రూపాయలు ఫీడ్ మీద తగ్గించడం, MRPలో 14 రూపాయల వరకూ తగ్గింపు ఇవ్వాలని నిర్ణయించాం.. త్వరలో సీఎం ద్వారా ఎన్నికల వాగ్దానం ప్రకారం 1.50 విద్యుత్ టారిఫ్ ఉండేలా వర్తింపచేస్తాం.. కామినేని శ్రీనివాసరావు నియోజకవర్గం, నా నియోజకవర్గం లోనే 3 లక్షల ఎకరాలు ఆక్వా సాగు ఉంది.. 600 కోట్ల భారం ఏపీ ఆక్వా పరిశ్రమపై పడింది.. ఈ భారం రైతు ఒక్కడిపైనే మోపడం సరైనది కాదని.. ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది… స్ధానిక వినియోగం ఎలా పెంచాలి అని ఆలోచించి ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (APPPC) ద్వారా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.. మా రెండు జిల్లాల్లో మూడు లక్షల ఎకరాలు ఆక్వా ఉంది.. ఈపవర్ టారిఫ్ అమలు ద్వారా రైతుల కల సాకారం అవుతుంది.. ఏపీ ఫ్రాన్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీకి నలభై కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాం.. వంద గ్రాముల నుంచి కిలో వరకు ప్యాక్ చేసి స్థానిక మార్కెట్ ను పెంచుతాం అని తెలిపారు.
Read Also: Sandhya Theatre: సంధ్య థియేటర్లో పాముల కలకలం?
మటన్ నిజానికి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. ఈ ష్రింప్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రచారం చేస్తాం.. లోకల్ మార్కెట్ కు ఐదు శాతం జీఎస్టీ ఉంది.. నిర్మలా సీతారామన్ తో చర్చించి ఆ ఐదు శాతం జీఎస్టీ రద్దు చేయాలని కోరతాం అన్నారు రఘురామకృష్ణం రాజు.. ఇప్పుడు ఎగుమతులకు ఎటువంటి ఇబ్బంది లేదు.. ఉన్న స్టాకు మొత్తం వెళ్లిపోయింది.. రొయ్యల పెంపకం దారులు ఎక్కువ.. తినేవారు తక్కువ ఉన్నారు. స్థానిక మార్కెట్ ను పెంచితే.. ఆక్వా రంగం అభివృద్ధి చెందుతుంది, రైతుకు ఆదాయం పెరుగుతుందని వెల్లడించారు డిప్యుటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు.
తాజావార్తలు
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?