GIS Summit: గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ కు అంతా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. విశాఖ కేంద్రంగా రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమ్మిట్ లో రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఇవాళ సమీక్షించారు. మరో మూడు రోజుల్లో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ జరుగనుంది.
Read Also:Twitter Layoff: డేటా ఎక్స్పర్ట్స్, ఇంజనీర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన ట్విట్టర్
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
వచ్చే నెల 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతి నుంచి పరిశ్రమలు రావటం లేదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా కారణంగా మొదటి రెండేళ్లు ఆర్ధిక కార్యక్రమాలే జరగని పరిస్థితి నెలకొంది. పైగా వచ్చే ఎడాది ఎన్నికలు కావటంతో ఇప్పుడు జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఆదానీ, అంబానీలు సైతం ఈ సమ్మిట్ కు వచ్చే విధంగా కసరత్తు చేశారు. మొదటి రోజు జాతీయ, అంతర్జాతీయ బడా పారిశ్రామిక వేత్తలతో సమ్మిట్ కళకళలాడనుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రెండో రోజు ఒప్పందాలు చేసుకునే ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి.
ఇటు ముఖ్యమంత్రి జగన్ ఇవాళ జీఐఎస్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేపట్టారు. ఇప్పటి వరకు 25 దేశాల నుంచి 7, 500 మంది డిలిగేట్స్ ఈ సమ్మిట్ కు రిజిష్టర్ చేసుకున్నట్లు సమాచారం. వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీవీఐపీల తాకిడి వల్ల సిటీలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా రూటింగ్ చేయటం, ఎక్కడికక్కడ సమ్మిట్ కు దారి తెలిసే విధంగా భారీ ఎత్తున హోర్డింగ్స్ , సిటీ గ్రీనరీ, బ్యూటిఫికేషన్ వంటి అనేక అంశాల పై ముఖ్యమంత్రి జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read Also: Missing: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది.. నెలరోజులు గడిచింది అయినా
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!