Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..
- ‘ఆడుదాం ఆంధ్ర’లో భారీ అవకతవకలు బహిర్గతం
- 100 కోట్ల ప్రాజెక్ట్లో 40 కోట్ల దుర్వినియోగం?
- మాజీ మంత్రి రోజా సహా పలువురిపై విజిలెన్స్ ఫోకస్
- నివేదికతో కఠిన చర్యల దిశగా ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల్లో జరిగిన భారీ అవకతవకలపై విజిలెన్స్ విభాగం విచారణ పూర్తి చేసింది. క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్తో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట 40 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ చివరకు వంద కోట్లకు చేరడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని, ఇందులో సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనం పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించి సుమారు 3000 పేజీల భారీ నివేదికను సిద్ధం చేశారు.
Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్బంప్స్ గ్యారెంటీ..
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
ఈ కుంభకోణానికి సంబంధించి సిద్ధమైన నివేదికలో అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా , శాప్ (SAAP) మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలు కీలక పాత్ర పోషించినట్లు విజిలెన్స్ స్పష్టంగా గుర్తించింది. వీరిద్దరితో పాటు అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్, రిటైర్డ్ ఐఏఎస్ వాణి మోహన్ , శాప్ ఐటి విభాగానికి చెందిన పలువురు అధికారుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన నేతలు , అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉండి, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు.
Pawan : పవన్కల్యాణ్ను వెంటాడిన సెంటిమెంట్?
ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందిస్తూ, తప్పు చేయనప్పుడు మాజీ మంత్రి రోజా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల రక్తమాంసాలను పంచుకుని తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అది అధికారులైనా లేదా రాజకీయ నాయకులైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉందా లేదా అనే అంశం కూడా నివేదిక అందిన తర్వాత స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడిన రోజా , బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలకు ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. త్వరలోనే ఈ నివేదిక అధికారికంగా ప్రభుత్వానికి చేరనుండటంతో, ప్రభుత్వం తీసుకునే చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!