AB Venkateswara Rao: పోస్టింగ్ ఇస్తారో.. ఖాళీగా కూర్చోబెడతారో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండేళ్లకు పైగా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం నాడు సచివాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు జీడీఏలో రిపోర్టు చేశారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను సీఎస్ సమీర్ శర్మను కలవలేదని చెప్పారు. తన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకే తాను సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించానని.. అయితే తనను కలిసేందుకు సమీర్ శర్మ విముఖత వ్యక్తం చేయడంతో జీఏడీలో రిపోర్ట్ చేశానని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.
తాను చట్ట ప్రకారం మాత్రమే ముందుకెళ్లానని.. ఏమైనా తప్పులుంటే బయటకు చెప్పాలి కదా అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. బెజవాడ సీపీగా ఉన్నప్పుడు ఇంటికెళ్లి ఎఫ్ఐఆర్ ఇచ్చామని.. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు పెడితే సరికాదని చెప్పేవాడినని పేర్కొన్నారు. 75 ఏళ్ల వయసులో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేందుకు యత్నించిన పోలీసులను వారించినట్లు గుర్తుచేశారు. అయితే ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నానని తనపై అప్పట్లో కొందరు ఫిర్యాదులు కూడా చేశారని తెలిపారు. సీఎస్ సమీర్ శర్మ సర్వీస్ పొడిగించుకుని పదవిలో కొనసాగుతున్నారని.. కానీ తాను ఇంకా సర్వీసులోనే ఉన్నానని వెల్లడించారు.
Also Read
- APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
Minister Karumuri: మీడియా తప్పుడు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం
పెండింగులో ఉన్న తన జీతం విషయం అడగాలని సీఎస్ను కలుద్దామని అనుకుంటున్నానని.. తన జీతం గురించి మాట్లాడేందుకు సీఎస్కు వచ్చిన ఇబ్బందేంటని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. తాను కూడా ఆయన లాగే పరీక్షలు రాసి ఐపీఎస్ అయ్యానని తెలిపారు. చాలా మందిని వీఆర్లో ఉంచి జీతాలివ్వడం లేదన్నారు. ఎందుకు జీతాలివ్వడం లేదంటే కులం పేరు చెప్పి కొందరికి.. ఇంటెలిజెన్సులో పని చేశామని కొందరికి.. తన దగ్గర పని చేశారని మరి కొందరికి జీతాలివ్వడం లేదని చెబుతున్నారని.. ఈ విషయాలన్నీ సీఎస్కు చెప్పాలని భావించానన్నారు. జీతం ఇవ్వకుంటే హైకోర్టులో ధిక్కార పిటిషన్ వేయాలని సూచించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమైందని పేర్కొన్నారు. రిపోర్ట్ చేయడం వరకే తన పని అని.. పోస్టింగ్ విషయం ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందన్నారు. తనకు ఏం పోస్టింగ్ ఇస్తారో తనకే తెలియదని.. పోస్టింగ్ ఇవ్వకుంటే జీతం ఇచ్చి తనను ఖాళీగా అట్టిపెట్టినట్టేనని.. అంతేకాకంఉడా ప్రజాధనం వృధా అయినట్టేనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!