Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరైన రణబీర్ కపూర్ తన సంపాదనను దీర్ఘకాలిక ఆస్తుల రూపంలోకి మారుస్తున్నారు. తాజాగా పూణే సమీపంలోని ముల్షీ తాలూకా, పింప్రి గ్రామంలో రణబీర్ సుమారు 25.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు పక్కపక్కనే ఉండే వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ‘CRE Matrix’ ద్వారా వెల్లడైన పత్రాల ప్రకారం, ఈ మొత్తం లావాదేవీ విలువ రూ. 16.42 కోట్లు. ఈ డీల్ కోసం ఆయన ఏకంగా రూ. 82.13 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.
రణబీర్ కపూర్ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ ‘రామాయణం‘ చిత్రంలో రాముడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రణబీర్ ఈ భూమి కొనుగోలు కోసం వెచ్చించిన మొత్తం… ఆయన రామాయణ చిత్రానికి అందుకుంటున్న పారితోషికంలో దాదాపు సగం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రణబీర్కు ముంబై వెలుపల భూములు కొనడం ఇది మొదటిసారేం కాదు. రెండు నెలల క్రితమే రణబీర్ అయోధ్యలోని ‘ది సరయూ’ ప్రాజెక్టులో రూ. 3.31 కోట్లతో ఒక ప్రీమియం ప్లాట్ను కొనుగోలు చేశారు. ఇప్పుడు ముల్షీ ప్రాంతం ముంబై-పూణే ప్రజలకు లగ్జరీ ఫామ్హౌస్లు, సెకండ్ హోమ్స్ నిర్మించుకోవడానికి అత్యంత ఇష్టమైన డెస్టినేషన్గా మారింది. 25 ఎకరాల ఈ భారీ స్థలంలో రణబీర్ భవిష్యత్తులో ఒక భారీ ఫామ్హౌస్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, కార్తీక్ ఆర్యన్ వంటి అగ్ర తారల సరసన రణబీర్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ‘స్మార్ట్ ఇన్వెస్టర్’ అనిపించుకుంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!