Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: భారత క్రికెట్లో సెన్సేషన్గా మారుతున్న యువ ఆల్రౌండర్ అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. సోషల్ మీడియాలో ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందరు చేస్తున్న వ్యాపారాలకు, అసభ్యకర ప్రచారాలకు కోర్టు బ్రేక్ వేసింది. అభిషేక్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతి సింగ్.. కీలకమైన తాత్కాలిక ఆదేశాలు జారీ చేశారు. అతని అనుమతి లేకుండా పేరు, ముఖచిత్రం, లేదా రూపాన్ని (పర్సనాలిటీ రైట్స్) కమర్షియల్ ప్రయోజనాల కోసం గానీ, సొంత ప్రచారం కోసం గానీ వాడకూడదని థర్డ్ పార్టీలపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాదు, ఇలాంటి అభ్యంతరకర లింకులను వెంటనే తొలగించాలంటూ మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను, ఈ-కామర్స్ వెబ్సైట్లను ఆదేశించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకుని కొందరు అభిషేక్ శర్మకు సంబంధించిన నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టిస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడమే కాకుండా, అతని గౌరవానికి, కమర్షియల్ వాల్యూకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. కొంతమంది సైలైట్లలో అతని మార్ఫింగ్ ఫొటోలపై అసభ్యకరమైన, సభ్యసమాజం తలదించుకునే భాషను వాడుతూ పోస్టులు పెడుతుండగా.. మరికొందరు అతని అనుమతి లేకుండా అతని పేరు, ఫొటోలతో టీషర్టులు, బట్టలు తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించే ఇలాంటి నకిలీ కంటెంట్ను వ్యాప్తి చేయడం, అలాగే అతని పేరుతో అక్రమంగా మర్చండైజ్ (దుస్తులు, వస్తువులు) అమ్మడంపై పూర్తిగా నిషేధం విధించారు.
Also Read
- Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
- Modi-Putin: "కార్ డిప్లమసీ".. ఒకే కారులో మోడీ-పుతిన్..
- Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్వెజ్ వివాదానికి బీజేపీ తెర!
అభిషేక్ శర్మ ప్రస్తుతం భారత జాతీయ జట్టులో కీలక ఆటగాడని, అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న ఒక ప్రభావవంతమైన వ్యక్తని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. నెట్టింట్లో అతనిపై పెట్టిన కంటెంట్ పూర్తిగా అబద్ధమని, అసభ్యకరంగా ఉంటూ అతని ప్రతిష్టను మసకబార్చేలా ఉందని జడ్జి అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు) ఉన్నప్పుడు, వారి అనుమతి లేకుండా వారి గుర్తింపును దుర్వినియోగం చేయకుండా రక్షణ పొందే హక్కు సదరు వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం అభిషేక్ శర్మే కాదు.. గతంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ నటీనటులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, పాడ్కాస్టర్ రాజ్ శమని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి ఎందరో ప్రముఖులు తమ పర్సనాలిటీ, పబ్లిసిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాంటి మధ్యంతర ఉపశమనాన్ని పొందారు.
తాజావార్తలు
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్పై సోదాలు..?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?