Alluri Sitharama Raju district: దసరా సెలవులకు వెళ్లిన విద్యార్థికి అస్వస్థత.. డోలీలో మోసుకెళ్లినా దక్కని ప్రాణాలు
Alluri: కాలం మారిన.. సాంకేతికత పెరిగిన కొందరి జీవితాలు మాత్రం మారడం లేదు. రాకెట్ యుగంలో అంతరిక్షాన్ని సందర్శించి వస్తున్న ఈ రోజుల్లో కొందరు ఊరి పొలిమేర దాటడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన మార్గం లేక కనీస వైద్యం అంధక ప్రాణాలను కోల్పోతున్నారు. సరైన రహదారి లేక కాలినడకన డోలీలో నిండు గర్బిణిని మోసుకెళ్లిన ఘటనలు, అనారోగ్యంతో సరైన సదుపాయాలు లేక కాలినడకన ఆసుపత్రికి వెళ్లేసరికి మృతి చెందిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా అల్లూరి ఏజెన్సీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. పెదబయలు మండలం లోని మారుమూల కుంబర్ల గ్రామానికి చెందిన అరడ కృష్ణ(10) అనే విద్యార్థి పెదబయలు ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు.
Read also:Russia: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. మధ్యవర్తిత్వం వహిస్తున్న చైనా,రష్యా..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
కాగా దసర సందర్భంగా పాఠశాలకు సెలవలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కృష్ణ దసరా సెలవలకి ఇంటికి వచ్చాడు. అయితే ఉన్నటుండి కృష్ణ అస్వస్థతకు గురైయ్యారు. దీనితో ఆ గ్రామానికి రహదారి సరిగా లేనందున బంధువులు డోలీలో కృష్ణను ఉంచి అతి కష్టం మీద గ్రామం నుండి అయిదు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ దగ్గరలో ఉన్న గోమంగి తరలించారు. అయితే వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. కృష్ణను పరీక్షించిన వైద్యులు ఆ బాలుడు చనిపోయినట్టు తెలియ చేశారు. దీనితో బంధువులు తిరిగి మృత దేహాన్ని డోలీలో మోసుకుంటూ ఇంటికి తెలుసుకువెళ్లారు. కుమారుడి మరణముతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూన్నారు. సరైన రహదారి సౌకర్యం లేక, ఆశ్రమాల్లో భద్రత లేక తమ బిడ్డను కోల్పోయామని బందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో