AP Crime: సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం
- సగం ధరకే బంగారం అంటూ భారీ మోసం..
- రూ.12 లక్షలనగదుతో కేటుగాళ్ల పరారీ..
- పార్వతీపురం మన్యం జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: బంగారం అంటే మనకు అసలే పిచ్చి.. భారీ డిమాండ్తో ఇప్పటికే తులం బంగారం ధర లక్ష దాటేసింది.. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర అవసరాలకు కొనేవారు కొంటూనే ఉన్నారు.. ఇదే అదునుగా భావించిన కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. పార్వతీపురం మన్యం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం చేశారు. 12 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు కేటుగాళ్లు.. దీంతో, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన బాధితురాలు శ్రీలక్ష్మి లబోదిమోమంటోంది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Tomato Price Crash: భారీగా పతనమైన టమాటా ధర.. తీవ్ర నిరాశలో రైతన్నలు..
- Family Suicide: ఏం కష్టం వచ్చిందో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురు మృతి, ఒకరికి సీరియస్..
గత నెలలో శ్రీలక్ష్మిని సగంధరకే బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించాడు రిషి అనే వ్యక్తి.. ఈ మేరకు పావు కిలో బంగారం కోసం రూ. 12 లక్షలకు ఒప్పందం కుదిరింది.. ఈ క్రమంలో 12 లక్షల రూపాయల నగదును సిద్ధం చేసింది శ్రీలక్ష్మి.. ఇక, సగం ధరకే బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై రిషి అనే వ్యక్తితో పాలకొండకు వెళ్లింది శ్రీలక్ష్మి. పాలకొండ నుంచి పార్వతిపురం వైపు బంగారం చూపిస్తామని తీసుకెళ్లారు కేటుగాళ్లు.. పార్వతీపురం పట్టణ శివారులో మాట్లాడుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు దుండగులు.. మహిళ ముఖంపై పౌడర్ జల్లి 12 లక్షల క్యాష్తో ఉడాయించారు.. దీంతో, పార్వతీపురం గ్రామీణ పోలీసులను సంప్రదించి జరిగిన మోసాన్ని వివరించారు బాధిత మహిళ శ్రీలక్ష్మి.. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు..
తాజావార్తలు
-
YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్ను కూకటివేళ్లతో పెకలిస్తా!
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!