Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం మామిడి పంచాయతీ పరిధిలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. పూరిగానివలస గ్రామ సమీపంలోని పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల గుంపు చక్కర్లు కొడుతుండటంతో రైతులు, కూలీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా సరిహద్దుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఏనుగుల కదలికలు పెరిగాయి.
ఏనుగుల సంచారం నేపథ్యంలో మామిడి పంచాయతీతో పాటు పరిసర గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తోటల వద్దకు వెళ్లరాదని, ఏనుగులు కనిపించిన వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు గుంపులుగా ప్రయాణించాలని, ఏనుగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. మామిడి పంచాయతీకి చెందిన రైతు రామారావు పామాయిల్ తోటలోకి ప్రవేశించిన ఏనుగులు డ్రిప్ ఇరిగేషన్ పైపులను ధ్వంసం చేశాయి. దీంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది.
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ఏనుగుల భయంతో పామాయిల్ తోటల్లో పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పండిన పామాయిల్ గెలలను కోయడం, వాటిని మార్కెట్కు తరలించడం కూడా కష్టసాధ్యంగా మారిందని గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఏనుగుల సంచారం రైతులకు కొత్త సమస్యగా మారిందని వారు వాపోతున్నారు. ఏనుగుల గుంపు ఇంకా తోటల పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!