ఎట్టకేలకు అఫ్ఘన్లకు క్షమాపణ చెప్పిన అమెరికా..!
ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ చీమ చిటుక్కుమన్న అగ్రరాజ్యం అమెరికాకు తెలిసిపోతుందని పేరుంది. అయితే ఇదంతా అమెరికా గత వైభవంగా కన్పిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లే అమెరికా ఇటీవల కాలంలో చాలా వైఫల్యాలను చవిచూస్తోంది. రాజకీయ కారణాలో లేక పరిపాలన దౌర్భాగ్యమో తెలిదుగానీ ఆ దేశానికి చెందిన నిఘా సంస్థలు సైతం ఇటీవల కాలంలో మెరుగైన పనితీరును కనబర్చడం లేదు. తాజాగా అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల తప్పుడు నిర్ణయంతో 10మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆ దేశానికే మాయని మచ్చగా మిగిలిపోయింది.
అఘనిస్తాన్లో తాలిబన్ల పాలనను అంతమొందించిన అమెరికా అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు సహకరించారు. ఆ దేశంలో అమెరికన్ మిలిటరీ బలగాలు దాదాపు 20ఏళ్లు తిష్టవేశాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న అమెరికా బలగాలను అమెరికా ఉపసంహరించుకునే కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా అప్ఘనిస్తాన్లోని అమెరికా బలగాలను గత నెలలో తరలించేందుకు అమెరికా యత్నించింది. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు తమ బలగాలను అమెరికా తరలించే ఏర్పాట్లు చేసింది.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
ఈ సమయంలోనే కాబుల్ ఎయిర్ పోర్టుపై ఐసిస్-కే తీవ్రదాడులు దాడికి యత్నిస్తున్నట్లు అమెరికన్ నిఘా వర్గాలు యూఎస్ దళాలకు సమాచారం అందించారు. ఓ టయోటా వాహనంలో ఐసిస్ తీవ్రవాదులు కాబుల్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారని పేర్కొంది. తీవ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు యూఎస్ దళాలకు సమాచారం ఇచ్చారు. దీంతో యూఎస్ దళాలు టయోటా వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి చేశారు. ఈ దాడిని అమెరికా అప్పట్లో తీవ్రవాదులపై చేసిన దాడికి సమర్థించుకుంది.
తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో తాము డ్రోన్ దాడి చేపట్టామని వెల్లడించారు. అయితే నిఘా వర్గాలు తప్పుడు సమాచారం వల్ల దురదృష్టవశాత్తు డ్రోన్ దాడిలో 10మంది అప్ఘనిస్తాన్ పౌరులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ దాడికి క్షమాపణ కోరుతున్నట్లు అమెరికా సైన్యం ఒక ప్రకటన వెలువడించింది. ఈ తప్పిదం నుంచి ఖచ్చితంగా తాము గుణపాఠం నేర్చుకుంటామని పేర్కొంది. మరోసారి ఇలాంటివి జరుగకుండా చూసుకుంటామని వెల్లడించింది. మొత్తానికి అఫ్గన్లో అమెరికా నిఘా వైఫల్యంతోపాటు అన్నింటా ఫెల్యూర్స్ ను ముట్టగట్టుకుంది.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో