ఎట్టకేలకు అఫ్ఘన్లకు క్షమాపణ చెప్పిన అమెరికా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ చీమ చిటుక్కుమన్న అగ్రరాజ్యం అమెరికాకు తెలిసిపోతుందని పేరుంది. అయితే ఇదంతా అమెరికా గత వైభవంగా కన్పిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లే అమెరికా ఇటీవల కాలంలో చాలా వైఫల్యాలను చవిచూస్తోంది. రాజకీయ కారణాలో లేక పరిపాలన దౌర్భాగ్యమో తెలిదుగానీ ఆ దేశానికి చెందిన నిఘా సంస్థలు సైతం ఇటీవల కాలంలో మెరుగైన పనితీరును కనబర్చడం లేదు. తాజాగా అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల తప్పుడు నిర్ణయంతో 10మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం ఆ దేశానికే మాయని మచ్చగా మిగిలిపోయింది.
అఘనిస్తాన్లో తాలిబన్ల పాలనను అంతమొందించిన అమెరికా అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు సహకరించారు. ఆ దేశంలో అమెరికన్ మిలిటరీ బలగాలు దాదాపు 20ఏళ్లు తిష్టవేశాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న అమెరికా బలగాలను అమెరికా ఉపసంహరించుకునే కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా అప్ఘనిస్తాన్లోని అమెరికా బలగాలను గత నెలలో తరలించేందుకు అమెరికా యత్నించింది. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు తమ బలగాలను అమెరికా తరలించే ఏర్పాట్లు చేసింది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
ఈ సమయంలోనే కాబుల్ ఎయిర్ పోర్టుపై ఐసిస్-కే తీవ్రదాడులు దాడికి యత్నిస్తున్నట్లు అమెరికన్ నిఘా వర్గాలు యూఎస్ దళాలకు సమాచారం అందించారు. ఓ టయోటా వాహనంలో ఐసిస్ తీవ్రవాదులు కాబుల్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారని పేర్కొంది. తీవ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు యూఎస్ దళాలకు సమాచారం ఇచ్చారు. దీంతో యూఎస్ దళాలు టయోటా వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి చేశారు. ఈ దాడిని అమెరికా అప్పట్లో తీవ్రవాదులపై చేసిన దాడికి సమర్థించుకుంది.
తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో తాము డ్రోన్ దాడి చేపట్టామని వెల్లడించారు. అయితే నిఘా వర్గాలు తప్పుడు సమాచారం వల్ల దురదృష్టవశాత్తు డ్రోన్ దాడిలో 10మంది అప్ఘనిస్తాన్ పౌరులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ దాడికి క్షమాపణ కోరుతున్నట్లు అమెరికా సైన్యం ఒక ప్రకటన వెలువడించింది. ఈ తప్పిదం నుంచి ఖచ్చితంగా తాము గుణపాఠం నేర్చుకుంటామని పేర్కొంది. మరోసారి ఇలాంటివి జరుగకుండా చూసుకుంటామని వెల్లడించింది. మొత్తానికి అఫ్గన్లో అమెరికా నిఘా వైఫల్యంతోపాటు అన్నింటా ఫెల్యూర్స్ ను ముట్టగట్టుకుంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!