అదృష్టం: ఒక్కరాత్రిలోనే ఆ 31 కుటుంబాలు కోట్లకు అధిపతులయ్యాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్యరాష్ట్రాల్లోని ప్రజలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అక్కడ నివశించే ప్రజలు పనుల కోసం, ఉద్యోగాల కోసం మైదాన ప్రాంతాలకు వస్తుంటారు. కాయాకష్టం చేసి జీవనాన్ని వెళ్లదీస్తుంటారు. కొంతమంది ఉన్న ఊర్లోనే ఉంటూ దొరికిన పనిచేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తుంటారు. ఇదే ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాలకు కలిసివచ్చింది. రాత్రికి రాత్రే వారిని కోటీశ్వరుల్ని చేసింది. రాత్రికి రాత్రే అంటే వారికేమి నిధులు, నిక్షేపాలు దొరకలేదు. ప్రభుత్వం నుంచే వారికి భారీ సాయం అందింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతం ప్రకృతికి నిలయం. అంతేకాదు, ఈ తవాంగ్ ప్రాంతంలో బొంజా అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు నివశిస్తున్నాయి. వీరికి కొంత భూమి ఉన్నది. ఈ భూమే వారిని కోటీశ్వరుల్ని చేసింది.
Read: సరికొత్త సోలార్ ప్యానల్స్: సూర్యుడి గమనాన్ని అనుసరించి…
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
ఈ గ్రామంలో ఇండియన్ ఆర్మీ కొన్ని నిర్మాణాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆర్మీ నివశించేందుకు గృహాలను నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికోసం కేంద్రం రూ. 200.056 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇండియన్ ఆర్మీ గృహాల నిర్మాణం కోసం బోంజా గ్రామంలో భూమిని సేకరించింది అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 31 కుటుంబాలకు చెందిన భూమిని సేకరించారు. ఈ 31 కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం కింద రూ. 40.8 కోట్ల రూపాలయను మంజూరు చేసింది. నష్టపరిహారానికి చెందని చెక్కులను ఆరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ ఆయా కుటుంబాలకు అందజేశారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలకు పైగా నష్టపరిహారం అందింది. నష్టపరిహారం కింద కోటి రూపాయలకు పైగా సొమ్ము అందడంతో ఆయా కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!