Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి..
- తండ్రి మృతదేహంతో అమానవీయ ఘటన..
- సోషల్ మీడియాలో వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow: సంబంధాలను, మానవత్వాన్ని ప్రశ్నించేలా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రహీమా బాద్ ప్రాంతంలోని ఖడౌహా గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రి మరణించిన తర్వాత ఆయన ఆస్తి కోసం మృతదేహంతో వేలిముద్ర వేయించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఖడౌహా గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఛత్రపాల్ మరణించారు. తండ్రి మరణించడంతో ఆయన కుమారుడు ఆస్తిని తన పేరుపైకి మార్చుకునేందుకు మహేంద్ర తన బంధువుతో కలిసి కుట్ర పడ్డారు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించకముందే మృతదేహం చేతి బొటనవేలితో తెల్ల కాగితాలపై వేలిముద్రలు తీసుకున్నారు. మృతుడి చేతిని పట్టుకుని తెల్ల కాగితాలపై వేలిముద్ర వేయిస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు గమనించారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
మృతదేహంతో జరుగుతున్న ఈ అమానవీయ ఘటనను చూసిన స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోను రికార్డు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. తండ్రి మరణించిన వెంటనే ఆస్తి కోసం ఇలాంటి చర్యకు పాల్పడటం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధాలు, మానవత్వాన్ని మరిచి ఆస్తి కోసం మృతదేహంతో కూడా ఇలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసుల దృష్టికి విషయం వెళ్లింది. పోలీసులు ఘటనపై సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. మృతుడి వేలిముద్రలను ఏ ప్రయోజనం కోసం తీసుకున్నారు.? ఆస్తికి సంబంధించిన పత్రాల్లో వాటిని ఉపయోగించ బోతున్నారా.? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.
इससे शर्मनाक कुछ नहीं हो सकता!
लखनऊ के रहीमाबाद स्थित खड़ौहा गांव से इंसानियत को शर्मसार करने वाला मामला सामने आया है। 75 वर्षीय छत्रपाल की मौत के बाद उनके इकलौते बेटे महेंद्र ने जमीन से जुड़े कागजात तैयार कराने के लिए पिता के शव के अंगूठे का निशान सादे कागज पर लगवाया। pic.twitter.com/h21RywHG4i
— Shivaji Mishra (@08febShivaji) August 13, 2026
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!