Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి..
- తండ్రి మృతదేహంతో అమానవీయ ఘటన..
- సోషల్ మీడియాలో వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow: సంబంధాలను, మానవత్వాన్ని ప్రశ్నించేలా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రహీమా బాద్ ప్రాంతంలోని ఖడౌహా గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రి మరణించిన తర్వాత ఆయన ఆస్తి కోసం మృతదేహంతో వేలిముద్ర వేయించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఖడౌహా గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఛత్రపాల్ మరణించారు. తండ్రి మరణించడంతో ఆయన కుమారుడు ఆస్తిని తన పేరుపైకి మార్చుకునేందుకు మహేంద్ర తన బంధువుతో కలిసి కుట్ర పడ్డారు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించకముందే మృతదేహం చేతి బొటనవేలితో తెల్ల కాగితాలపై వేలిముద్రలు తీసుకున్నారు. మృతుడి చేతిని పట్టుకుని తెల్ల కాగితాలపై వేలిముద్ర వేయిస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు గమనించారు.
Also Read
- BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
- Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
- BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
మృతదేహంతో జరుగుతున్న ఈ అమానవీయ ఘటనను చూసిన స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోను రికార్డు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. తండ్రి మరణించిన వెంటనే ఆస్తి కోసం ఇలాంటి చర్యకు పాల్పడటం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధాలు, మానవత్వాన్ని మరిచి ఆస్తి కోసం మృతదేహంతో కూడా ఇలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసుల దృష్టికి విషయం వెళ్లింది. పోలీసులు ఘటనపై సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. మృతుడి వేలిముద్రలను ఏ ప్రయోజనం కోసం తీసుకున్నారు.? ఆస్తికి సంబంధించిన పత్రాల్లో వాటిని ఉపయోగించ బోతున్నారా.? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.
इससे शर्मनाक कुछ नहीं हो सकता!
लखनऊ के रहीमाबाद स्थित खड़ौहा गांव से इंसानियत को शर्मसार करने वाला मामला सामने आया है। 75 वर्षीय छत्रपाल की मौत के बाद उनके इकलौते बेटे महेंद्र ने जमीन से जुड़े कागजात तैयार कराने के लिए पिता के शव के अंगूठे का निशान सादे कागज पर लगवाया। pic.twitter.com/h21RywHG4i
— Shivaji Mishra (@08febShivaji) August 13, 2026
తాజావార్తలు
-
Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు ‘కదిరి కాకాజీ’ టైటిల్ ఫిక్స్ చేసారా?
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
ట్రెండింగ్
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!