CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
- విదేశీ టూర్కు బ్రేక్.. రేవంత్ ఫైర్
- లండన్కు ఓకే.. అమెరికాకు నో ఎందుకు?
- ‘నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు’
- మోదీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అభివృద్ధి, విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా తాను తలపెట్టిన విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్లో భాగస్వామ్యమవుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటే, కేంద్రం రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఈ అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
విదేశీ పర్యటన ఉద్దేశం.. విద్య, పెట్టుబడులే మా లక్ష్యం
రాష్ట్రాల కలయికతోనే కేంద్రం ఏర్పడుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రైజింగ్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో విద్య, క్రీడలు, పారిశ్రామిక రంగానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. గాంధీ, అంబేడ్కర్ లాంటి మహానీయులు చదువుకున్న ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావాలని భావించామని, ఇక్కడే ఆ స్థాయి క్యాంపస్లు వస్తే వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని వివరించారు.
Also Read
లండన్కు ఓకే.. అమెరికాకు నో ఎందుకు?
తన విదేశీ పర్యటనకు సంబంధించి కేంద్రానికి సమర్పించిన దరఖాస్తులో అన్ని వివరాలు పక్కాగా పొందుపరిచామని, పర్యటన ఉద్దేశాన్ని (పర్పస్) స్పష్టంగా వివరించామని సీఎం తెలిపారు. దరఖాస్తులో అసంపూర్ణ వివరాలు ఉన్నాయంటూ బీజేపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. లండన్, అమెరికా పర్యటనలకు ఒకే రకమైన ప్రతిపాదనలు సమర్పిస్తే.. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చి, అమెరికా పర్యటనను ఎందుకు తిరస్కరించారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పర్యటనలో విషయంలో లేకపోతే ఇంగ్లాండ్కు ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
పర్యటనపై బీజేపీ రాజకీయాలు.. మోడీ గుజరాత్కే ప్రధానా?
కేంద్రం తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం తెలంగాణ ముఖ్యమంత్రిని తిరస్కరించడం కాదని, ఇది తెలంగాణ ప్రజలను తీవ్రంగా అవమానించడమేనని రేవంత్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా కాకుండా కేవలం ‘గుజరాతీ’గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి వైబ్రెంట్ గుజరాత్ రోడ్ షోల కోసం అమెరికా, కెనడాల్లో పర్యటించేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం, తెలంగాణ అభివృద్ధి కోసం తాను వెళ్తానంటే ఎందుకు అడ్డుకుందో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా దేశంలోని అనేకమంది నాయకులు, కోట్లాది మంది ప్రజలు తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. పరిపాలనాపరమైన ఈ అంశంపై విచక్షణ కోల్పోయి అవాస్తవాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, వారికి ఆ స్థాయి కూడా లేదని తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!