వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం జరిగింది. అందులో నక్సలిజం 23శాతానికి , మరణాల సంఖ్య 21శాతానికి తగ్గింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాలతో నక్సలిజాన్ని అణిచివేయడంలో సఫలం. దశాబ్దాల పోరాటంలో తొలిసారిగా 200 కంటే తక్కువ మంది మరణించారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలన జరగకపోతే దేశ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదు. కేంద్రబలగాల కోసం రాష్ట్రాలు భరించే ఖర్చును ప్రధాని తగ్గించారు. ఫలితంగా 2900 కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్రాలకు తగ్గిపోయింది అన్నారు.
ఇక ఆయుధాలు అప్పగించి ప్రజాస్వామ్య స్రవంతిలోకి వచ్చే మావోయుస్టులను ఆహ్వానిస్తూనే, అమాయక జనాన్ని, పోలీసులను చంపే వారికి అదే రీతిలో బుద్ధి చెప్తున్నాం. గత ఆరు దశాబ్దాలలో అభివృద్ధి లేమి కారణంగానే వామపక్ష తీవ్రవాదానికి బీజం పడింది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి జరుగుతోంది. సామాన్య ప్రజల అభివృద్ధికి అడ్డుపడకూడదని వామపక్ష తీవ్రవాదులు సైతం భావిస్తున్నారు, అందుకే వేగంగా పనులు జరుగుతున్నాయి. వామపక్ష తీవ్రవాదం వల్ల గత 40 ఏళ్లలో 16వేల మంది పౌరులు చనిపోయారు.
Also Read
ఈశాన్య ప్రాంతాల్లో తిరుగుబాటు బృందాలు సైతం లొంగిపోతున్నాయి అన్నారు. వామపక్ష తీవ్రవాదం నిర్మూలనకు వారి ఆర్థిక వనరులను అడ్డుకోవడం అత్యంత ముఖ్యం. హింసాత్మక ఘటనలు 70శాతం తగ్గిపోయాయి, మృతుల సంఖ్య 82శాతానికి తగ్గింది. ప్రస్తుతం 53 జిల్లాలలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. వామపక్ష తీవ్రవాదులకు ఆర్థిక వనరులు అందకుండా రాష్ట్రాలు పరస్సర సహకారంతో గట్టి చర్యలు తీసుకోవాలి. త్వరలోనే వామపక్ష తీవ్రవాదానికి చరమగీతం పాడే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Varanasi: వారణాసిలో మహేష్ బాబు రాముడి లుక్ లీక్? నెట్టింట వైరల్ అవుతోన్న పిక్.. అసలు నిజం ఇదే!
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
-
Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
-
Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
-
Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..