ఒక వైపు కరోనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాలతో వరుస వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు వెలువరించింది. వివిధ పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలలపై ఆంక్షలు అమలుచేస్తోంది.
రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగించే అంశం పై నేడు నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ఎన్నికల సంఘం.కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు, ఎన్నికలు జరగనున్న 5 రాష్టాల ఉన్నతాధికారులు, 5 రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి రానుంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8 న ప్రకటిస్తూ, ఎన్నికల ప్రచార సభలను, రోడ్ షో లను, ఇతర ఎన్నికల ప్రచారాలను జనవరి 15 వ తేదీ వరకు నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత, మరలా జనవరి 22 వ తేదీ వరకూ నిషేధాన్ని పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఈ రోజు మరోసారి సమీక్షించి నిషేధం కొనసాగించాలా, లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే రాజకీయ పార్టీలు ఇండోర్ సమావేశాలు నిర్వహించుకునేందుకు మాత్రం అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏదైనా సమావేశ మందిరంలో 300 మంది వరకు హాజరయ్యేందుకు, లేదా సమావేశ మందిరం సామర్ధ్యం లో 50 శాతం వరకు సమావేశమయ్యేందుకు అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం.