ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం… ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక వైపు కరోనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాలతో వరుస వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు వెలువరించింది. వివిధ పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలలపై ఆంక్షలు అమలుచేస్తోంది.
రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగించే అంశం పై నేడు నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ఎన్నికల సంఘం.కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు, ఎన్నికలు జరగనున్న 5 రాష్టాల ఉన్నతాధికారులు, 5 రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి రానుంది కేంద్ర ఎన్నికల సంఘం.
Also Read
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8 న ప్రకటిస్తూ, ఎన్నికల ప్రచార సభలను, రోడ్ షో లను, ఇతర ఎన్నికల ప్రచారాలను జనవరి 15 వ తేదీ వరకు నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత, మరలా జనవరి 22 వ తేదీ వరకూ నిషేధాన్ని పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఈ రోజు మరోసారి సమీక్షించి నిషేధం కొనసాగించాలా, లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే రాజకీయ పార్టీలు ఇండోర్ సమావేశాలు నిర్వహించుకునేందుకు మాత్రం అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏదైనా సమావేశ మందిరంలో 300 మంది వరకు హాజరయ్యేందుకు, లేదా సమావేశ మందిరం సామర్ధ్యం లో 50 శాతం వరకు సమావేశమయ్యేందుకు అనుమతించింది కేంద్ర ఎన్నికల సంఘం.
తాజావార్తలు
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్రూమ్ వార్ అదిరింది
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!