గాంధీలో కరోనా మరణాల కలకలం.. 15 గంటల వ్యవధిలో 35 మంది మృతి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరణమృదంగం మోగుతోందా ? కేవలం 24 గంటల వ్యవధిలో 35 మంది ఎందుకు మరణించారు ? గాంధీలో కరోనా పేషంట్ల మరణాల రేటు ఎక్కువగా ఎందుకు ఉంటోంది ? అనేది పరిశీలిస్తే కీలక విషయాలు వెల్లడయ్యాయి.
తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆసుపత్రి గాంధీ. ప్రస్తుతం 305 మంది పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు పదిహేను వందల బెడ్లతో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ఇప్పుడు కరోనా మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 15 గంటల వ్యవధిలో ఏకంగా 35 మంది మరణించిన దుస్థితి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో ఏకంగా ఇంత ఎక్కువ మరణాలు చోటు చేసుకోవడం అటు ప్రభుత్వ వర్గాలను, ఇటు ప్రజల్ని షాక్ కు గురిచేస్తోంది.
Also Read
కరోనా కారణంగా ఇన్ని మరణాలు చోటు చేసుకుంటున్నా.. వైద్యాధికారులు సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. పదిహేను గంటల వ్యవధిలో మరణించిన 35 మందిలో 45 ఏళ్లు.. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు. మిగిలిన వారంతా 46 ఏళ్ల నుంచి 83 ఏళ్ల మధ్యలో వారు. మరణించిన 35 మంది లో 16 మంది మహిళలు కాగా.. 19 మంది పురుషులు. సాధారణంగా మరణాల్లోనూ పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా.. తాజాగా మహిళల మృతుల సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళన కలిగించే అంశమే..
పాజిటివ్ వచ్చినా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యం చేసి.. పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. మరికొందరేమో.. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు చేసి, చికిత్స చేయించుకుని వెంటిలేటర్పై ఉన్న సమయంలో గాంధీ ఆస్పత్రికి వస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కరోనాతో వస్తే కొన్ని ఆస్పత్రులు చేర్చుకోవట్లేదు. ఇలా అన్ని ఆస్పత్రులు తిరిగి.. చివరికి గాంధీ ఆస్పత్రికి వస్తున్న వారు ఉన్నారు. అందువల్ల గాంధీకి తీసుకురావడంతో మరణాల రేటు ఎక్కువగా ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..