ఢిల్లీకి ఏపీ పొలిటికల్ హీట్..! ఆధారాలతో సహా ఈసీ ముందుకు వైసీపీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది.. మాటల యుద్ధమే కాదు.. చివరకు దాడులకు వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, ఇప్పుడు ఓవైపు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తుంటే.. మరోవైపు టీడీపీ వ్యవహారశైలికి వ్యతిరేకంగా కౌంటర్ దీక్షలు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడంలేదు.. శనివారం రోజు ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దృష్టికి దాడుల విషయాన్ని తీసుకెళ్లిన చంద్రబాబు.. హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశమై.. రాష్ట్రంలోని పరిస్థితిని వివరించేందుకు రెడీ అవుతున్నారు.. ఇదే సమయంలో వైసీపీ కూడా ఢిల్లీ బాట పట్టనుంది.. దీంతో.. ఏపీలో రాజకీయ సెగ కాస్త ఢిల్లీని తాకినట్టు అవుతుంది.
టీడీపీపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనుంది.. టీడీపీ గుర్తింపు రద్దు చేయమని ఈసీని కోరేందుకు రెడీ అవుతోంది.. సోమవారం తర్వాత ఈసీకి వైసీపీ నేతలు లేఖ అందించనున్నట్టుగా సమాచారం.. ఇక, ఈ లేఖ ద్వారా కీలకమైన అంశాన్ని లేవనెత్తనుంది వైసీపీ.. రాజకీయ పార్టీల నేతలు బూతులు మాట్లాడుతున్న అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనుంది.. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికల వేళ మాత్రమే నేతలు ఉపయోగించే భాష పై ఈసీ కట్టడి ఉంటుంది.. ఆ తర్వాత నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా నియంత్రణ వ్యవస్థ లేని విషయాన్ని ఈసీకి వివరించనుంది వైసీపీ. ఎన్నికల ప్రక్రియ లేని సందర్భాల్లోనూ నేతల భాషను ఈసీ కట్టడి కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరనున్నట్టుగా తెలుస్తోంది. తాజా టీడీపీ బూతుల ఎపిసోడ్ తో పాటు ఈమధ్య కాలంలో ఆ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన మీడియా క్లిప్పింగ్స్, వీడియో ఫూటేజ్ ఆధారాలతో సహా ఈసీకి సమర్పించేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!