రెండో టెస్టులో కోహ్లీ కోసం బలయ్యేదెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 3 నుంచి ముంబై వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఉత్కంఠ రేపిన తొలి టెస్టు చివరకు డ్రాగా ముగియడంతో రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం చేస్తుండటంతో అతడు ఎవరి స్థానాన్ని భర్తీ చేస్తాడన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టెస్టు జట్టులోకి కొత్తగా వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో అతడిపై వేటు వేసే అవకాశం లేదు. దీంతో సీనియర్ ఆటగాళ్లు పుజారా, రహానెలలో ఒకరిని తప్పిస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ వారిద్దరూ జట్టులోనే ఉంటే.. ఓపెనర్లలో ఒకరిపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ రాణించలేదు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో వీరిద్దరిలో ఎవరిని తప్పిస్తారో వేచి చూడాలి.
Read Also: అలర్ట్: విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ కలకలం
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ఓపెనర్లలో ఒకరిని తప్పిస్తే ఆ స్థానంలో పుజారా లేదా వికెట్ కీపర్ సాహా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే గతంలో సాహాకు ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. అయితే తొలిటెస్టులో సాహా మెడనొప్పితో బాధపడుతుండటంతో సబ్స్టిట్యూట్ కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ చేశాడు. మరి రెండో టెస్టుకు సాహా సిద్ధంగా లేకపోతే ఉన్న ఏకైక ఆప్షన్ పుజారాను ఓపెనింగ్కు పంపడమే. అయితే కోహ్లీ బదులు ఏ ఆటగాడిని తప్పిస్తారో.. టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈనెల 3వరకు ఆగాల్సిందే. మరోవైపు ఈ టెస్టు గెలవడం టీమిండియాకు తప్పనిసరి. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో ముందడుగు వేయాలన్నా… గత ఛాంపియన్షిప్ ఫైనల్లో తమను ఓడించిన కివీస్పై ప్రతీకారం తీర్చుకోవాలన్నా.. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో మెరుగుపడటం టీమిండియాకు చాలా కీలకం.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!