What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. అయితే ఈ మహాసభలు తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు సీపీఎం మహాసభలు జరుగునున్నాయి. ఈ మహాసభలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం హజరుకానున్నారు. ఆయనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు.
- నేడు ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించిన కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టికెట్లు విడుదల చేస్తారు.
- తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగాల భర్తీ కోసం నేడు నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టేందుకు పోలీసులను అనుమతి కోరగా.. కోవిడ్ నిబంధనల దృష్ట్యా అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీ కార్యాలయంలో సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రి 4 గంటల వరకు జరుగనుంది. ఈ దీక్షలో తెలంగాణ బీజేపీ ఇన్చార్జీ తరుణ్చుగ్ పాల్గొననున్నారు.
- తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం నేడు ఎర్రవెల్లిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఎర్రవెల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నారు.
- ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అంక్షలు అమలు చేయనున్నారు.
- నేడు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో భారత ఎన్నికల సంఘం భేటీ కానుంది. 2022లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కోవిడ్ ఉధృతి దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాలా.. వద్దా అనే విషయంపై చర్చించనున్నారు.
- నేడు ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్ వేడుకకు సీఎం జగన్ హజరుకానున్నారు.
- నేడు రాజమండ్రిలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతూనే ఉంది.
- నేడు ఏపీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నందిగామ ఎంఎంఆర్ కళాశాలలో ఈ జాబ్మేళా జరుగనుంది. 18-30 ఏళ్ల లోపు వారు హజరుకావచ్చని ఏపీఎస్ఎస్డీసీ వెల్లడించింది.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
-
Kollywood: నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరు?
-
MS Dhoni: “మిస్టర్ కూల్”కి అంత కోపం వచ్చిందా.. మ్యాచ్ ఓడిపోవడంతో టీవీ పగలగొట్టాడా.?
-
Jasprit Bumrah: డాన్ బ్రాడ్మన్కు రివర్స్.. బుమ్రా పేరిట అత్యంత చెత్త ప్రపంచ రికార్డు!
-
Peddi: రిలీజ్కు ముందే నార్త్ అమెరికాలో.. ‘పెద్ది’ రికార్డ్ హంగామా..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!