What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. అయితే ఈ మహాసభలు తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు సీపీఎం మహాసభలు జరుగునున్నాయి. ఈ మహాసభలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం హజరుకానున్నారు. ఆయనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు.
- నేడు ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించిన కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టికెట్లు విడుదల చేస్తారు.
- తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగాల భర్తీ కోసం నేడు నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టేందుకు పోలీసులను అనుమతి కోరగా.. కోవిడ్ నిబంధనల దృష్ట్యా అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీ కార్యాలయంలో సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రి 4 గంటల వరకు జరుగనుంది. ఈ దీక్షలో తెలంగాణ బీజేపీ ఇన్చార్జీ తరుణ్చుగ్ పాల్గొననున్నారు.
- తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం నేడు ఎర్రవెల్లిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఎర్రవెల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నారు.
- ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అంక్షలు అమలు చేయనున్నారు.
- నేడు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో భారత ఎన్నికల సంఘం భేటీ కానుంది. 2022లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కోవిడ్ ఉధృతి దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాలా.. వద్దా అనే విషయంపై చర్చించనున్నారు.
- నేడు ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్ వేడుకకు సీఎం జగన్ హజరుకానున్నారు.
- నేడు రాజమండ్రిలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతూనే ఉంది.
- నేడు ఏపీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నందిగామ ఎంఎంఆర్ కళాశాలలో ఈ జాబ్మేళా జరుగనుంది. 18-30 ఏళ్ల లోపు వారు హజరుకావచ్చని ఏపీఎస్ఎస్డీసీ వెల్లడించింది.
Also Read
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!