What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. అయితే ఈ మహాసభలు తాడేపల్లిలోని సీఎస్ఆర్ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు సీపీఎం మహాసభలు జరుగునున్నాయి. ఈ మహాసభలకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం హజరుకానున్నారు. ఆయనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు.
- నేడు ఆన్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. జనవరికి సంబంధించిన కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లు విడుదల చేస్తున్నారు. వచ్చే నెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల టికెట్లు విడుదల చేస్తారు.
- తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగాల భర్తీ కోసం నేడు నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష చేపట్టేందుకు పోలీసులను అనుమతి కోరగా.. కోవిడ్ నిబంధనల దృష్ట్యా అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీ కార్యాలయంలో సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రి 4 గంటల వరకు జరుగనుంది. ఈ దీక్షలో తెలంగాణ బీజేపీ ఇన్చార్జీ తరుణ్చుగ్ పాల్గొననున్నారు.
- తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం నేడు ఎర్రవెల్లిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఎర్రవెల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రానున్నారు.
- ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అంక్షలు అమలు చేయనున్నారు.
- నేడు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో భారత ఎన్నికల సంఘం భేటీ కానుంది. 2022లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే కోవిడ్ ఉధృతి దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాలా.. వద్దా అనే విషయంపై చర్చించనున్నారు.
- నేడు ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్ వేడుకకు సీఎం జగన్ హజరుకానున్నారు.
- నేడు రాజమండ్రిలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు భేటీ కానున్నాయి. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీలో సినిమా థియేటర్ల మూసివేత కొనసాగుతూనే ఉంది.
- నేడు ఏపీలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నందిగామ ఎంఎంఆర్ కళాశాలలో ఈ జాబ్మేళా జరుగనుంది. 18-30 ఏళ్ల లోపు వారు హజరుకావచ్చని ఏపీఎస్ఎస్డీసీ వెల్లడించింది.
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!