కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్తానం విడుదల వారీగా ప్రతి నెల శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి రోజుకు 10 వేల చొప్పున టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ‘కర్షకులకు అండగా కాంగ్రెస్’ అనే నినాదంతో వరి దీక్ష కార్యక్రమం చేపట్టనుంది. నేడు, రేపు రైతులకు మద్దతుగా కాంగ్రెస్ దీక్ష చేయనుంది.
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ్యంపై చర్చించనున్నారు.
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైన నేపథ్యంలో నేడు కడప జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ నేపథ్యంలో రాజంపేట మండంలంలోని 4 గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించి వరద నష్టంపై అంచనా వేయనుంది.
హైదరాబాద్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,930లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 67,900లు ఉంది.