ఐసెట్ చివరి విడత కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కొత్తగా కౌన్సిలింగ్లో పాల్గొనే విద్యార్థులు నేడు స్లాట్ బుక్ చేసుకోవాలని కన్వీనర్ మిత్తల్ నవీన్ కోరారు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. రేపు, ఎల్లుండి వెబ్ అప్షన్లకు అవకాశం ఉందని తెలిపారు.
చంద్రబాబు కుటుంబం పట్ల అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మౌన ప్రదర్శనలు, దీక్షలు చేపట్టాని పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీడీపీ శ్రేణులు మౌనప్రదర్శనలు, దీక్షలు చేపట్టనున్నారు.
నేడు భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 మ్యాచ్ జరుగనుంది. కోల్కత్తా వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
నేడు ఢిల్లీకి మంత్రులు, ఎంపీలు, అధికారుల సీఎం కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించాలని కేసీఆర్ నిర్ణయం మేరకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి జలాల వాటపైనా స్పష్టత కోరతామని సీఎం కేసీఆర్ తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లత్ నేడు మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించనున్నారు. తన మంత్రి వర్గంలో 12 మంది కొత్తవారికి చోటు కల్పించనున్నారు. అంతేకాకుండా సచిన్ పైలట్ వర్గానికి చెందిన 5గురికి మంత్రివర్గం చోటు దక్కింది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు వీలుగా నిన్న మంత్రులు రాజీనామా చేశారు.
నేడు ఐఎన్ఎస్ విశాఖ యుద్ధనౌకను రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ జాతికి అంకింతం చేయనున్నారు. దేశీయంగా నిర్మించిన ఈ ఐఎన్ఎస్ విశాఖ యుద్దనౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది.