ఇంకెన్నాళ్లీ అయోమయం… అసలు ఏవోబీలో ఏం జరుగుతోంది?
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో.. శ్రీకాకుళం జిల్లాలోని మాణిక్యపట్నం గ్రామంలో తరచుగా నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులు.. అక్కడి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లు.. ఆంధ్రాలోనే ఉంటామని చెబుతున్నా.. మాణిక్యపట్నంపై ఒడిశా అధికారులు పట్టు పెంచుకోవాలని చూడడం.. అది తమ రాష్ర పరిధిలోని గ్రామమే అని వాదిస్తుండడం.. పదే పదే ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. స్థానికులకు ఈ పరిణామం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది.
ఈ మధ్య.. అతి చొరవ తీసుకుని మాణిక్యపట్నం గ్రామ తహసీల్దార్ కార్యాలయానికి సీల్ వేసి.. స్థానికుడైన నాయకుడు గురునాథం అనే వ్యక్తిని గారబంద పోలీసులు అరెస్ట్ చేయడంతో.. కలకలం మొదలైంది. ఈ విషయంపై.. శ్రీకాకుళం కలెక్టర్ తో పాటు.. ఒడిశాలోని పర్లాకిమిడి కలెక్టర్లు స్పందించడంతో.. అప్పటికప్పుడు సమస్య పరిష్కారమైంది. కానీ.. మంత్రి సీదిరి అప్పల్రాజు తాజా పర్యటన సందర్భంగా.. ఒడిశా అధికారులు మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించారు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
మంత్రి మాణిక్యపట్నం పరిసరాలకు వెళ్లిన సమయంలోనే.. సరిహద్దు గ్రామాలకు వెళ్లిన ఒడిశా లోని గజపతి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సంగారాం పండా.. ఆ రాష్ట్ర ఇతర అధికారులు.. మళ్లీ ఆంధ్రాకు చెందిన గిరిజనులను బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఆ ప్రాంతానికి వెళ్లి వారితో మాట్లాడారు. తమ వద్ద ఏవోబీ రికార్డులు సైతం ఉన్నాయని.. ఇలా తెలుగు వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి కాస్త ఆగ్రహించినట్టు తెలిసింది.
తమ వద్ద కూడా రికార్డులు ఉన్నాయని ఒడిశా అధికారులు చెప్పినా.. వాటిని చూపించలేదని సమాచారం. ఇదే సమయంలో గిరిజనులు మరోసారి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారట. తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారట. ఇప్పటికే మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరుతో తాము ఇబ్బంది పడుతున్నామని.. ఇలా తరచుగా ఒడిశా అధికారులు ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంటున్నారట.
ఒక్క మాణిక్య పట్నంలోనే కాదు.. ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మరికొన్ని గ్రామాలు సైతం.. ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. సరిహద్దును సరిగ్గా నిర్ణయిస్తే.. ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా.. అన్న అభిప్రాయం అక్కడి ప్రజలనుంచి వ్యక్తమవుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో స్పందిస్తేనే.. తమ సమస్య పరిష్కారం అవుతుందని వారు చెబుతున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో