ఇంకెన్నాళ్లీ అయోమయం… అసలు ఏవోబీలో ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో.. శ్రీకాకుళం జిల్లాలోని మాణిక్యపట్నం గ్రామంలో తరచుగా నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులు.. అక్కడి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లు.. ఆంధ్రాలోనే ఉంటామని చెబుతున్నా.. మాణిక్యపట్నంపై ఒడిశా అధికారులు పట్టు పెంచుకోవాలని చూడడం.. అది తమ రాష్ర పరిధిలోని గ్రామమే అని వాదిస్తుండడం.. పదే పదే ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. స్థానికులకు ఈ పరిణామం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది.
ఈ మధ్య.. అతి చొరవ తీసుకుని మాణిక్యపట్నం గ్రామ తహసీల్దార్ కార్యాలయానికి సీల్ వేసి.. స్థానికుడైన నాయకుడు గురునాథం అనే వ్యక్తిని గారబంద పోలీసులు అరెస్ట్ చేయడంతో.. కలకలం మొదలైంది. ఈ విషయంపై.. శ్రీకాకుళం కలెక్టర్ తో పాటు.. ఒడిశాలోని పర్లాకిమిడి కలెక్టర్లు స్పందించడంతో.. అప్పటికప్పుడు సమస్య పరిష్కారమైంది. కానీ.. మంత్రి సీదిరి అప్పల్రాజు తాజా పర్యటన సందర్భంగా.. ఒడిశా అధికారులు మళ్లీ వివాదాస్పదంగా వ్యవహరించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
మంత్రి మాణిక్యపట్నం పరిసరాలకు వెళ్లిన సమయంలోనే.. సరిహద్దు గ్రామాలకు వెళ్లిన ఒడిశా లోని గజపతి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ సంగారాం పండా.. ఆ రాష్ట్ర ఇతర అధికారులు.. మళ్లీ ఆంధ్రాకు చెందిన గిరిజనులను బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి ఆ ప్రాంతానికి వెళ్లి వారితో మాట్లాడారు. తమ వద్ద ఏవోబీ రికార్డులు సైతం ఉన్నాయని.. ఇలా తెలుగు వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి కాస్త ఆగ్రహించినట్టు తెలిసింది.
తమ వద్ద కూడా రికార్డులు ఉన్నాయని ఒడిశా అధికారులు చెప్పినా.. వాటిని చూపించలేదని సమాచారం. ఇదే సమయంలో గిరిజనులు మరోసారి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారట. తాము ఆంధ్రాలోనే ఉంటామని తేల్చి చెప్పారట. ఇప్పటికే మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరుతో తాము ఇబ్బంది పడుతున్నామని.. ఇలా తరచుగా ఒడిశా అధికారులు ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంటున్నారట.
ఒక్క మాణిక్య పట్నంలోనే కాదు.. ఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మరికొన్ని గ్రామాలు సైతం.. ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. సరిహద్దును సరిగ్గా నిర్ణయిస్తే.. ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా.. అన్న అభిప్రాయం అక్కడి ప్రజలనుంచి వ్యక్తమవుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో స్పందిస్తేనే.. తమ సమస్య పరిష్కారం అవుతుందని వారు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!