Uttarakhand: బాలికను చంపి తిన్న చిరుత.. మట్టుబెట్టేందుకు గ్రామస్తులు ప్లాన్
- ఉత్తరాఖండ్లో ఓ చిన్నారిని బలి తీసుకున్న చిరుత
- ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై దాడి
- ఇంటికి 30 మీటర్ల దూరంలో పొదల్లో లభ్యమైన బాలిక మృతదేహం
- భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు
- చిరుతను మట్టుబెట్టేందుకు ప్లాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో ఓ అమాయక చిన్నారిని చిరుత బలి తీసుకుంది. తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేసి చంపి తిన్నది. ఈ ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఇంటికి 30 మీటర్ల దూరంలోని పొదల్లో సగం తిన్న బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దీంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. దానిని మట్టుబెట్టేందుకు చూస్తున్నారు.
Vulture Population: భారత్లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
హిందావ్ పట్టిలోని భౌద్ గ్రామానికి చెందిన రుకం సింగ్ కుమార్తె తొమ్మిదేళ్ల పూనమ్.. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి ప్రాంగణంలో ఒంటరిగా ఆడుకుంటుంది. తన మరో ముగ్గురు అక్కాచెళ్లె్ల్లు ఇంట్లో ఉన్నారు. ఆమె తల్లి ఉషాదేవి దేవుడి పూజ కోసం గుడికి వెళ్లింది. అయితే.. సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి పూనమ్ ఇంట్లో కనిపించలేదు. పూనమ్ అక్క ప్రియాంక, తమ్ముడు ప్రిన్స్, ఆరాధ్య గదిలో నిద్రిస్తున్నారు. తల్లి చుట్టుపక్కల వెతికినా పూనమ్ కనిపించలేదు. పక్కనే ఉన్న వారు కూడా బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. ఇంటికి కొంత దూరంలో రోడ్డుపై పూనమ్ చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి.
Pawan Kalyan- Anasuya: పవన్ తో మోత మోగించే అనసూయ ఐటెం సాంగ్?
సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూనమ్ మృతదేహం ఇంటికి 30 మీటర్ల దూరంలో పొదల్లో పడి ఉంది. పూనమ్ గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నట్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెప్పాడు. అతని తండ్రి విదేశంలో ఉంటున్నాడని.. హోటల్లో పనిచేస్తున్నట్లు తెలిపాడు. అయితే చిన్నారిని చంపిన చిరుతను పట్టుకునేందుకు గ్రామంలో బోన్లు ఏర్పాటు చేశామని, అది ఎక్కడ సంచరిస్తుందోనని ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని రేంజర్ ఆశిష్ నౌటియాల్ తెలిపారు. మరోవైపు దేవప్రయాగ్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు చిరుత భీభత్సానికి వ్యతిరేకంగా తహసీల్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అటవీ సిబ్బందిని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చిరుతను పట్టుకునేందుకు నగరం చుట్టూ బోనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అదే సమయంలో చిరుతల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వాహనాల ఏర్పాటుతో పాటు పకడ్బందీగా ఉన్న అటవీ సిబ్బంది సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
- Tags
- cheetah
- girl
- kill
- plan
- uttarakhand
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!