Uttarakhand: బాలికను చంపి తిన్న చిరుత.. మట్టుబెట్టేందుకు గ్రామస్తులు ప్లాన్
- ఉత్తరాఖండ్లో ఓ చిన్నారిని బలి తీసుకున్న చిరుత
- ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై దాడి
- ఇంటికి 30 మీటర్ల దూరంలో పొదల్లో లభ్యమైన బాలిక మృతదేహం
- భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు
- చిరుతను మట్టుబెట్టేందుకు ప్లాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో ఓ అమాయక చిన్నారిని చిరుత బలి తీసుకుంది. తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేసి చంపి తిన్నది. ఈ ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఇంటికి 30 మీటర్ల దూరంలోని పొదల్లో సగం తిన్న బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దీంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. దానిని మట్టుబెట్టేందుకు చూస్తున్నారు.
Vulture Population: భారత్లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
హిందావ్ పట్టిలోని భౌద్ గ్రామానికి చెందిన రుకం సింగ్ కుమార్తె తొమ్మిదేళ్ల పూనమ్.. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి ప్రాంగణంలో ఒంటరిగా ఆడుకుంటుంది. తన మరో ముగ్గురు అక్కాచెళ్లె్ల్లు ఇంట్లో ఉన్నారు. ఆమె తల్లి ఉషాదేవి దేవుడి పూజ కోసం గుడికి వెళ్లింది. అయితే.. సాయంత్రం 4 గంటల సమయంలో తల్లి గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి పూనమ్ ఇంట్లో కనిపించలేదు. పూనమ్ అక్క ప్రియాంక, తమ్ముడు ప్రిన్స్, ఆరాధ్య గదిలో నిద్రిస్తున్నారు. తల్లి చుట్టుపక్కల వెతికినా పూనమ్ కనిపించలేదు. పక్కనే ఉన్న వారు కూడా బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. ఇంటికి కొంత దూరంలో రోడ్డుపై పూనమ్ చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి.
Pawan Kalyan- Anasuya: పవన్ తో మోత మోగించే అనసూయ ఐటెం సాంగ్?
సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూనమ్ మృతదేహం ఇంటికి 30 మీటర్ల దూరంలో పొదల్లో పడి ఉంది. పూనమ్ గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నట్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చెప్పాడు. అతని తండ్రి విదేశంలో ఉంటున్నాడని.. హోటల్లో పనిచేస్తున్నట్లు తెలిపాడు. అయితే చిన్నారిని చంపిన చిరుతను పట్టుకునేందుకు గ్రామంలో బోన్లు ఏర్పాటు చేశామని, అది ఎక్కడ సంచరిస్తుందోనని ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని రేంజర్ ఆశిష్ నౌటియాల్ తెలిపారు. మరోవైపు దేవప్రయాగ్లో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు చిరుత భీభత్సానికి వ్యతిరేకంగా తహసీల్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అటవీ సిబ్బందిని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చిరుతను పట్టుకునేందుకు నగరం చుట్టూ బోనులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అదే సమయంలో చిరుతల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వాహనాల ఏర్పాటుతో పాటు పకడ్బందీగా ఉన్న అటవీ సిబ్బంది సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
- Tags
- cheetah
- girl
- kill
- plan
- uttarakhand
తాజావార్తలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!