Vulture Population: భారత్లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..
- భారత్లో క్షీణించిన రాబందుల జనాభా..
- మనుషుల అకాల మరణాలతో లింక్..
- తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vulture Population: మానవుల అకాల మరణాలకు, భారతదేశంలో క్షీణిస్తున్న ‘రాబందుల’ జనాభాకు సంబంధం ఉందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ పర్యావరణ విపత్తు ఫలితంగా 2000 నుంచి 2005 వరకు అర మిలియన్ మంది మానవులు అకాల మరణం చెందినట్లు తెలిపింది. పర్యావరణ వ్యవస్థలో ఈ కీలకమైన స్కావెంజర్లు లేకపోవడం వల్ల ఏర్పడిన ప్రజారోగ్య సంక్షోభం, జీవవైవిధ్యం మరియు మానవ ఆరోగ్యం మధ్య ఉండాల్సిన సున్నితమైన సమతుల్యతపై ప్రభావం చూపినట్లుగా చెప్పింది.
అమెరికన్ ఎకనామిక్ రివ్యూలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ప్రజారోగ్య సంక్షోభం వల్ల ఏటా దాదాపుగా 70 బిలియన్ల ద్రవ్య నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. ఈ ఫలితాలు రాబందుల వంటి కీలకమైన జాతుల్ని సంరక్షించాల్సిన బాధ్యతను సూచిస్తోంది. రాబందులు ఇండియాలో కీలమైన జాతి, దేశంలోని అనేక పర్యావరణ వ్యవస్థల పనితీరుకు చాలా అవసరమైనవి అని అధ్యయనం చెప్పింది.
Also Read
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
- India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
- Kerala: "దీపం" వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
Read Also: Tamil Nadu: తమిళనాడులో ఆరుగురు రష్యా పౌరులు అరెస్ట్..
రాబందులు కేవలం వ్యాధుల బారిన పడిన మృతదేహాలు శుభ్రం చేయడమే కాకుండా, ఆహారాన్ని తీసివేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఉదాహరణకు రాబిస్తో చనిపోయిన కుక్కల ద్వారా ఇతరుకు ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా రాబందులు రక్షిస్తాయి. ఇదే కాకుండా రాబందులు లేకుంటే, రైతులు చనిపోయిన తమ పశువులను నీటి మార్గాల్లో పారేస్తారు, ఇది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుందని స్టడీ చెప్పింది.
1994లో రైతులు తమ పశువులు, ఇతర జంతువులకు నొప్పి, వాపు తగ్గేందుకు ‘డైక్లోఫెనాక్’ అనే మందు ఇవ్వడం ప్రారంభించారు. అయితే, ఈ డ్రగ్ తీసుకున్న జంతువుల కళేబరాలను తిన్న తర్వాత రాబందులకు విపరీత ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. వాటి మూత్రపిండాలు నాశనమయ్యాయి. కేవలం ఒక దశాబ్ధంలోనే రాబందుల జనాభా 50 మిలియన్ల నుంచి కేవలం వేలకు పడిపోయింది.
తాజావార్తలు
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
-
T20I Matches: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. టీ20 మ్యాచ్ల వేళల్లో మార్పులు.. ఒక గంట ముందుగానే..
-
Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!