Vulture Population: భారత్లో క్షీణించిన రాబందుల జనాభా.. మనుషుల అకాల మరణాలతో లింక్..
- భారత్లో క్షీణించిన రాబందుల జనాభా..
- మనుషుల అకాల మరణాలతో లింక్..
- తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి..
Vulture Population: మానవుల అకాల మరణాలకు, భారతదేశంలో క్షీణిస్తున్న ‘రాబందుల’ జనాభాకు సంబంధం ఉందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ పర్యావరణ విపత్తు ఫలితంగా 2000 నుంచి 2005 వరకు అర మిలియన్ మంది మానవులు అకాల మరణం చెందినట్లు తెలిపింది. పర్యావరణ వ్యవస్థలో ఈ కీలకమైన స్కావెంజర్లు లేకపోవడం వల్ల ఏర్పడిన ప్రజారోగ్య సంక్షోభం, జీవవైవిధ్యం మరియు మానవ ఆరోగ్యం మధ్య ఉండాల్సిన సున్నితమైన సమతుల్యతపై ప్రభావం చూపినట్లుగా చెప్పింది.
అమెరికన్ ఎకనామిక్ రివ్యూలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ప్రజారోగ్య సంక్షోభం వల్ల ఏటా దాదాపుగా 70 బిలియన్ల ద్రవ్య నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. ఈ ఫలితాలు రాబందుల వంటి కీలకమైన జాతుల్ని సంరక్షించాల్సిన బాధ్యతను సూచిస్తోంది. రాబందులు ఇండియాలో కీలమైన జాతి, దేశంలోని అనేక పర్యావరణ వ్యవస్థల పనితీరుకు చాలా అవసరమైనవి అని అధ్యయనం చెప్పింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Tamil Nadu: తమిళనాడులో ఆరుగురు రష్యా పౌరులు అరెస్ట్..
రాబందులు కేవలం వ్యాధుల బారిన పడిన మృతదేహాలు శుభ్రం చేయడమే కాకుండా, ఆహారాన్ని తీసివేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఉదాహరణకు రాబిస్తో చనిపోయిన కుక్కల ద్వారా ఇతరుకు ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా రాబందులు రక్షిస్తాయి. ఇదే కాకుండా రాబందులు లేకుంటే, రైతులు చనిపోయిన తమ పశువులను నీటి మార్గాల్లో పారేస్తారు, ఇది వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుందని స్టడీ చెప్పింది.
1994లో రైతులు తమ పశువులు, ఇతర జంతువులకు నొప్పి, వాపు తగ్గేందుకు ‘డైక్లోఫెనాక్’ అనే మందు ఇవ్వడం ప్రారంభించారు. అయితే, ఈ డ్రగ్ తీసుకున్న జంతువుల కళేబరాలను తిన్న తర్వాత రాబందులకు విపరీత ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. వాటి మూత్రపిండాలు నాశనమయ్యాయి. కేవలం ఒక దశాబ్ధంలోనే రాబందుల జనాభా 50 మిలియన్ల నుంచి కేవలం వేలకు పడిపోయింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!