రేపు ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… ఇందిరాపార్క్ ధర్నాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన వ్యక్తం చేశామన్నారు. పంజాబ్లో ధాన్యం కొను గోలు చేస్తారు.. తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందన్నారు.
రాష్ర్టానికి ఒక విధానం ఉండకూడదా..? కేంద్రంపై ఒత్తిడి పెంచేం దుకు ఇందిరా పార్కులో రేపు మహాధర్నా నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్రావు తెలిపారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. ప్రజాస్వామ్య యుతంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఎల్లప్పుడు రైతుల పక్షాపాతి అని హరీష్ పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరగడం కోసమే ఈ ధర్నా నిర్వహి స్తున్నామన్నారు. కేంద్రం అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలని వెల్లడించారు.