మరోసారి కిలో టమాటా ధర సెంచరీ దాటేసింది… ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. దీంతో.. కూరగాయల ధరలకు క్రమంగా రెక్కలు వచ్చాయి.. ఓ దశలో కిలో టమాటా ధర ఏకంగా రూ.120 వరకు చేరింది.. ఇది హోల్ సేల్ మార్కట్లో పరిస్థితి.. ఇక బహిరంగ మార్కెట్కు వెళ్లే సరికి రూ.150గా పలికిందని వ్యాపారులు చెబుతున్నమాట.. అయితే.. వర్షాలు తగ్గిపోవడం.. ప్రభుత్వ చర్యలతో టమాటా ధర దిగివచ్చింది.. కానీ, మరోసారి టమాటా ధరకు రెక్కలు వచ్చాయి.. రాష్ట్రంలో టమాటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో మరోసారి సెంచరీ దాటేసింది కిలో టమాటా ధర.. ఇవాళ టమాట ధర కేజీకి రూ.102గా పలుకుతోంది.. ఇది కాస్తా వినియోగదారుడికి చేరే సరికి మరింత పెరుగుతుంది. దీంతో.. టమాటాను కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: బూస్టర్ డోస్పై కీలక నిర్ణయం..!
కాగా, మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాల ఎగుమతి జరుగుతోంది.. నాణ్యమైన టమాటా ఈ ఏడాది ఆరంభలో.. కిలో రూ.6 నుంచి రూ.14 వరకు హోల్సేల్లో విక్రయాలు సాగించారు.. వర్షాలకు ముందు కిలో టమాటా రూ. 50కి పైగా పలికింది.. ఇక, వర్షాల తర్వాత అమాంతం పెరిగిపోయి.. వంద దాటేసింది.. మధ్యలో కాస్త తగ్గినట్టే అనిపించినా.. మరోసారీ కిలో టమాటా నూరు రూపాయలకు పైగా పలుకుతుంది. దీనికి ప్రధాన కారణం పంట దిగుబడి లేకపోవడమే అంటున్నారు వ్యాపారులు. టమాటా మాత్రమే కాదు.. ఈ మధ్య అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి.. బహిరంగ మార్కెట్లో ఏ కూరగాయ తీసుకున్నా కిలో రూ.60-80కి పైగా పలుకుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.