మళ్లీ సెంచరీ దాటిన టమాటా ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కిలో టమాటా ధర సెంచరీ దాటేసింది… ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. దీంతో.. కూరగాయల ధరలకు క్రమంగా రెక్కలు వచ్చాయి.. ఓ దశలో కిలో టమాటా ధర ఏకంగా రూ.120 వరకు చేరింది.. ఇది హోల్ సేల్ మార్కట్లో పరిస్థితి.. ఇక బహిరంగ మార్కెట్కు వెళ్లే సరికి రూ.150గా పలికిందని వ్యాపారులు చెబుతున్నమాట.. అయితే.. వర్షాలు తగ్గిపోవడం.. ప్రభుత్వ చర్యలతో టమాటా ధర దిగివచ్చింది.. కానీ, మరోసారి టమాటా ధరకు రెక్కలు వచ్చాయి.. రాష్ట్రంలో టమాటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో మరోసారి సెంచరీ దాటేసింది కిలో టమాటా ధర.. ఇవాళ టమాట ధర కేజీకి రూ.102గా పలుకుతోంది.. ఇది కాస్తా వినియోగదారుడికి చేరే సరికి మరింత పెరుగుతుంది. దీంతో.. టమాటాను కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: బూస్టర్ డోస్పై కీలక నిర్ణయం..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
కాగా, మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాల ఎగుమతి జరుగుతోంది.. నాణ్యమైన టమాటా ఈ ఏడాది ఆరంభలో.. కిలో రూ.6 నుంచి రూ.14 వరకు హోల్సేల్లో విక్రయాలు సాగించారు.. వర్షాలకు ముందు కిలో టమాటా రూ. 50కి పైగా పలికింది.. ఇక, వర్షాల తర్వాత అమాంతం పెరిగిపోయి.. వంద దాటేసింది.. మధ్యలో కాస్త తగ్గినట్టే అనిపించినా.. మరోసారీ కిలో టమాటా నూరు రూపాయలకు పైగా పలుకుతుంది. దీనికి ప్రధాన కారణం పంట దిగుబడి లేకపోవడమే అంటున్నారు వ్యాపారులు. టమాటా మాత్రమే కాదు.. ఈ మధ్య అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి.. బహిరంగ మార్కెట్లో ఏ కూరగాయ తీసుకున్నా కిలో రూ.60-80కి పైగా పలుకుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..