Atrocious: రూ.10 కోసం బాలుడి దారుణ హత్య..
- రూ.10 కోసం బాలుడి దారుణ హత్య
- యూపీలోని మొరదాబాద్లో ఘటన
- స్విమ్మింగ్ పూల్కు వచ్చిన బాలుడు
- రూ.10 ఇవ్వలేదన్న కారణంతో గొంతు నులిమి చంపిన యజమాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
వివరాల్లోకి వెళ్తే.. రాజ్కుమార్, అతని కుమారుడు వీర్పాల్లు పొలంలోనే అక్రమంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. అయితే.. ఆ పూల్ లోకి వెళ్లాలంటే 10 రూపాయలు ఇవ్వాల్సిందే. కాగా.. ఆ గ్రామానికి చెందిన సీమా యాదవ్ 11 ఏళ్ల కుమారుడు ఆయుష్ యాదవ్ రోజూ పూల్ వద్దకు వెళ్లేవాడు. అందులోకి వెళ్లి డబ్బులు ఇవ్వకుండా తరచూ పారిపోయేవాడు. అయితే.. బుధవారం సాయంత్రం స్నానం చేయమని ఆయుష్ను ఇంటి నుంచి పంపించింది. తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఆందోళనకు గురైంది. ఆమె స్విమ్మింగ్ పూల్లో బాలుడి కోసం వెతకడానికి వెళ్లినా అతని జాడ కనిపించలేదు. సీమ తన బంధువులతో కలిసి స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల పొలాల్లో కొడుకు కోసం వెతికింది. బంధువులు ఆయుష్ కోసం రాత్రంతా వెతికారు. అయితే.. కొలనుకు 15 మీటర్ల దూరంలోని చెరుకు తోటలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
Airtel: నిన్న జియో, నేడు ఎయిర్టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు..
డీఐజీ మునిరాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సీమ నుంచి సమాచారం తీసుకున్నారు. రూ.10 ఇవ్వలేదని స్విమ్మింగ్ పూల్ యజమాని రాజ్కుమార్, అతని కుమారుడు వీర్పాల్ తన నోటిలో, ముక్కులో ఇసుకను పోసి గొంతుకోసి హత్య చేశారని సీమ ఆరోపించింది. ఈ ఘటనపై వీర్పాల్ను విచారిస్తున్నట్లు నగర ఎస్పీ అఖిలేష్ భదౌరియా తెలిపారు. త్వరలో అతని తండ్రిని కూడా అరెస్టు చేయనున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!