Atrocious: రూ.10 కోసం బాలుడి దారుణ హత్య..
- రూ.10 కోసం బాలుడి దారుణ హత్య
- యూపీలోని మొరదాబాద్లో ఘటన
- స్విమ్మింగ్ పూల్కు వచ్చిన బాలుడు
- రూ.10 ఇవ్వలేదన్న కారణంతో గొంతు నులిమి చంపిన యజమాని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
వివరాల్లోకి వెళ్తే.. రాజ్కుమార్, అతని కుమారుడు వీర్పాల్లు పొలంలోనే అక్రమంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. అయితే.. ఆ పూల్ లోకి వెళ్లాలంటే 10 రూపాయలు ఇవ్వాల్సిందే. కాగా.. ఆ గ్రామానికి చెందిన సీమా యాదవ్ 11 ఏళ్ల కుమారుడు ఆయుష్ యాదవ్ రోజూ పూల్ వద్దకు వెళ్లేవాడు. అందులోకి వెళ్లి డబ్బులు ఇవ్వకుండా తరచూ పారిపోయేవాడు. అయితే.. బుధవారం సాయంత్రం స్నానం చేయమని ఆయుష్ను ఇంటి నుంచి పంపించింది. తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఆందోళనకు గురైంది. ఆమె స్విమ్మింగ్ పూల్లో బాలుడి కోసం వెతకడానికి వెళ్లినా అతని జాడ కనిపించలేదు. సీమ తన బంధువులతో కలిసి స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల పొలాల్లో కొడుకు కోసం వెతికింది. బంధువులు ఆయుష్ కోసం రాత్రంతా వెతికారు. అయితే.. కొలనుకు 15 మీటర్ల దూరంలోని చెరుకు తోటలో బాలుడి మృతదేహం లభ్యమైంది.
Airtel: నిన్న జియో, నేడు ఎయిర్టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు..
డీఐజీ మునిరాజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సీమ నుంచి సమాచారం తీసుకున్నారు. రూ.10 ఇవ్వలేదని స్విమ్మింగ్ పూల్ యజమాని రాజ్కుమార్, అతని కుమారుడు వీర్పాల్ తన నోటిలో, ముక్కులో ఇసుకను పోసి గొంతుకోసి హత్య చేశారని సీమ ఆరోపించింది. ఈ ఘటనపై వీర్పాల్ను విచారిస్తున్నట్లు నగర ఎస్పీ అఖిలేష్ భదౌరియా తెలిపారు. త్వరలో అతని తండ్రిని కూడా అరెస్టు చేయనున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..