Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tdp Won In Graduate Mlc Election

MLC Elections Results: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా.. ఇద్దరు అభ్యర్థుల గెలుపు

Published Date :March 18, 2023 , 7:02 am
By NTV WebDesk
MLC Elections Results: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా.. ఇద్దరు అభ్యర్థుల గెలుపు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది. ప్రముఖ అధ్యాపకుడు వేపాడ చిరంజీవి అనూహ్యమైన విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన గెలుపును ఎన్నికల సంఘం ప్రకటించింది. చతుర్ముఖ పోటీ జరిగిన ఉత్తరాంధ్ర స్థానంలో మొత్తం ఓటర్లు 2లక్షల 89 వేల 214మంది. ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో రెండు లక్షల ఒక వెయ్యి 335ఓట్లు నమోదయ్యాయి. వీటిలో 69శాతం పైగా పోలింగ్ నమోదైంది. వీటిలో ఎక్కువ ఇన్ వ్యాలీడ్ ఓట్లు రాగా.. ఆ సంఖ్య 12వేల 318. ఈ ఓట్లు పోగా లెక్కింపుకు అర్హత కలిగినవి లక్ష 89 వేల 17. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో లెక్కింపు ప్రారంభించగా ఫలితం వెలువడెందుకు 48గంటలకు పైగా సమయం పట్టింది.

Also Read:Amit Shah: ఆస్కార్ వచ్చాక అమిత్‌షాని కలిసిన రామ్ చరణ్, చిరంజీవి

పాలైన ఓట్లలో లెక్కించేందుకు అర్హత కలినవి లక్ష 89వేల 17ఒట్లుగా నిర్ధారించి కౌంటింగ్ చేపట్టారు. వీటిలో సగం కంటే ఎక్కువ ఓట్లు నమోదు అయిన అభ్యర్థి గెలిచినట్టు లెక్క. ఈ ప్రకారం 94 వేల 509 ఓట్లు అవసరం అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కించగా.. 8 రౌండ్స్ లోనూ టిడిపి దూసుకు వెళ్ళింది. పార్టీ అభ్యర్థి వేపాడకు 82 వేల 958 ఓట్లు వచ్చాయి.దీంతో విజయానికి ఇంకా 11 వేల 551 ఓట్లు అవసరం అయింది. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓటును లెక్కించాలిసీ వచ్చింది. ఇందుకు అవసరమైన కోటా ఓట్లు సాధించేందుకు మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఎలిమి నేషన్ విధానంలో 33మంది ఇండిపెండెంట్లు ద్వారా 786., బీజేపీ అభ్యర్థి నుంచి మూడు వేలు.,పీడీఎఫ్ రమాప్రభ ద్వారా 4500ఓట్లు వేపాడ చిరంజీవికి లభించాయి.

Also Read:Amit Shah: హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ గెలుపుపై అమిత్ షా హర్షం.. నడ్డా అభినందనలు

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన కంచర్ల శ్రీకాంత్ గెలిచారు. చిత్తూరు ఎస్వీసెట్‌ కళాశాలలో రెండో రోజైన ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఏడు రౌండ్లలో 2 లక్షల 69 వేల 339 ఓట్లు పోలవ్వగా ఇందులో 20 వేల 979 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2 లక్షల 48 వేల 360 ఓట్లు లెక్కించగా రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి తెదేపా అభ్యర్థి లక్షా 12 వేల 686 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డికి 85 వేల 423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది.

Also Read:MLC Ramachandra Reddy: ప్రతి టీచర్ కు ధన్యవాదాలు.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా 

తనకు ఓటు వేసి గెలిపించిన వారికి విజేత కంచర్ల శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు ఇదొక నిదర్శనం అని ఆయన అన్నారు.
దాదాపు 38 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు చెప్పారు. 2024 లోనూ టిడిపి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన అక్రమాలు అరాచకాలే తన గెలుపుకు దోహదపడ్డాయి అని అన్నారు. దొంగ ఓట్లు వేసి పోలింగ్ రోజున అక్రమాలకు పాల్పడ్డ తానెప్పుడూ భయపడలేదన్నారు. ప్రజలపై నమ్మకం ఉంచానని, దాన్ని నేడు రుజువు చేశారని చెప్పారు. ఎన్నో అక్రమాలు చేసిన వైసీపీకి తగిన బుద్ధిని ప్రజలు ఓటు ద్వారా చెప్పారని తెలిపారు. తన గెలుపు కోసం మూడు నెలలుగా ఎంతో శ్రమించానని…తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకుకృతజ్ఞతలు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chittoor
  • east rayalaseema
  • Graduates
  • Kancharla Srikanth
  • tdp

తాజావార్తలు

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

  • Guavas Theft: అమానుషం.. జామకాయలు దొంగిలించిందని చిన్నారిని కొట్టి గొలుసులతో బంధించిన రిటైర్డ్ ఆర్మీ

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions