Amit Shah: ఆస్కార్ వచ్చాక అమిత్షాని కలిసిన రామ్ చరణ్, చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Chiranjeevi Meets Amit Shah: అమెరికాలో ఆస్కార్ వేడుకలను ఘనంగా జరుపుకున్న అనంతరం ఈరోజు ఉదయం భారత్కి తిరిగొచ్చిన రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశాడు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ముగ్గురు కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా.. ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ఆస్కార్ గెలుచుకోవడం పట్ల అమిత్ షా అభినందించారు. సినిమాకు సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారు. ఇటు.. తండ్రితో కలిసి అమిత్షాను రామ్ చరణ్ కలవగా.. అటు తారక్ ‘ధమ్కీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు.. జూ. ఎన్టీఆర్ను అమిత్ షా హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో కలుసుకున్న విషయం అందరికీ తెలిసిందే! ఆ సమయంలో వీళ్లిద్దరు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు.
Viswak Sen: నా మాస్ అమ్మ మొగుడు.. ఎన్టీఆర్.. అసలు సినిమా ముందుంది
Also Read
మరోవైపు.. ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహిస్తోన్న రెండు రోజుల సదస్సులో రామ్ చరణ్ పాల్గొనున్నాడు. అందుకే.. నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయి, అక్కడే ఉండిపోయాడు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రానున్నారు. ప్రధాని మోడీతో కలిసి చరణ్ ఈ వేదికను పంచుకోనున్నాడు. కాగా.. మార్చి 12వ తేదీన జరిగిన ఆస్కార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు’ పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ దక్కిన విషయం విదితమే! దీంతో.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. లాస్ఏంజెల్స్లో ఈ అవార్డ్ని కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత మొదటగా తారక్ భారత్కు తిరిగిరాగా.. మార్చి 17వ తేదీన టీమ్ మొత్తం హైదరాబాద్కు తిరిగొచ్చింది.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..