ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో మొత్తం 35 మంది అభ్యర్థులు నిలిచారు. 43 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ తుది గడువు ముగిసే నాటికి ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 27వ తేదీన ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. Also…
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.
Sweeper Posts: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలలో సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోస్ట్ ఏదైనా సరే అర్హత అంతకుమించి ఉన్న కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా హర్యానా రాష్ట్రంలో ఈ నిరుద్యోగ సమస్య ఎలా ఉందో చెప్పేందుకు ఓ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించిన…
ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ప్రధానితో పాటు 72 మంది మంత్రులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈసారి ప్రధాని మోడీ టీమ్లో చాలా మంది పాత ముఖాలకు మళ్లీ అవకాశం దక్కింది. మరి మోడీ ప్రభుత్వంలోని మంత్రులు ఎంత విద్యావంతులుగా ఉన్నారో తెలుసుకుందాం. పీహెచ్డీ పూర్తి చేసిన వారిలో మొత్తం 7 మంది మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఎంబీఏ చదివారు. ప్రధాని…
బీఆర్కే భవన్ లో సీఈఓని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిశారు. ఈ నెల 27 వ తేదీ నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వర్కింగ్ డే రోజు జరుగుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటింగ్ ఉన్నవారికి పోలింగ్ రోజు వేతనం తో కూడిన సెలువు ప్రకటించాలని వెంకట్ కోరారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్ర…
ఏపీలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగుతుంది.