టీడీపీ ఇంఛార్జ్లపై తెలుగు తమ్ముళ్లు గుర్రు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే నియోజకవర్గాలలో అంతంత మాత్రంగా ఉంది పార్టీ పరిస్థితి. మెరుగు పరుచుకోవడానికి అవకాశం వచ్చినా ఆ ముగ్గురు సద్వినియోగం చేసుకోలేదట. అందుకే కేడర్ వారిపై గుర్రుగా ఉంది. మళ్లీ చూద్దామన్న నేతల మాటలను జీర్ణించుకోలేకపోతున్నారట. లాభం లేదని అధినేతకు ఫిర్యాదులు చేశారట తమ్ముళ్లు. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం.
సోషల్ మీడియాలో ఇంఛార్జ్లపై తమ్ముళ్లు ఫైర్!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, శ్రీకాళహస్తీ, తిరుపతి నియోజకవర్గాల ఇంఛార్జులు ఒక్కసారిగా పార్టీ వర్గాల్లో చర్చగా మారారు. చంద్రగిరి ఇంఛార్జ్ పులవర్తి నాని, శ్రీకాళహస్తి ఇంచార్జ్ బొజ్జల సుధీర్రెడ్డి, తిరుపతి ఇంఛార్జ్ సుగుణమ్మలపై తమ్ముళ్లు గుర్రుగా ఉండటమే ఆ చర్చకు కారణం. ఎన్నికల్లో ఎలాగూ గెలవలేదు. పార్టీ పుంజుకోవడానికి అవకాశం వచ్చినా వారు సద్వినియోగం చేసుకోలేదని టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. అక్కడితో ఆగితే సరిపోదని అనుకున్నారో ఏమో.. సోషల్ మీడియా వేదికగా కూడా తెగ ఫీలవుతున్నారట. అదే ఇప్పుడు చర్చగా మారింది.
ఓడాక కేడర్ను.. ఇప్పుడు సమస్యలను పట్టించుకోవడం లేదా?
అమరరాజా ఫ్యాక్టరీ వివాదం రాజకీయ దుమారం రేపింది. పద్ధతి మార్చుకుంటే ఫ్యాక్టరీ ఉంటుందని.. వైసీపీ నేతలు తేల్చిచెప్పారట. టీడీపీ నేతలు ఈ వైఖరిని ఖండించారు. వేలమంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడతారని మండిపడ్డారు. అయితే స్థానికంగా ఉన్న సుగుణమ్మ, సుధీర్, నానిలు మాత్రం పెదవి విప్పలేదు. వారు లైట్ తీసుకున్నారట. ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత ఎలాగూ కేడర్ను పట్టించుకోలేదు. కనీసం పార్టీకి ఉపయోగపడే సందర్భంలో అయినా బద్ధకం వీడితే బాగుండేది కదా అని చర్చకు పెట్టారట.
రాజకీయంగా ఉపయోగపడే అంశంలో సైలెంట్!
అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగుల్లో దాదాపు ఎనబైశాతం వరకు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తికి చెందినా వారే. ఫ్యాక్టరీ తరలిస్తారనే ప్రచారం వారిన కలవర పెట్టింది. ఒకవేళ తరలిస్తే ఈ మూడు నియోజకవర్గల్లో పార్టీపై ప్రభావం పడుతుందని తమ్ముళ్లు లెక్కలు వేసుకున్నారట. లెఫ్ట్ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మాత్రమే నిరసన తెలిపాయి. ఎంత చేసినా రాజకీయంగా ఆ పార్టీలకు వచ్చే ఉపయోగం ఏదీ లేదు. రాజకీయంగా ఉపయోగపడే అంశంలో టీడీపీ నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఎవరు చేసినా క్రెడిట్ మా ఖాతాలో పడుతుందని అనుకున్నారో ఏమో నో టెన్షన్ అన్నట్టు సైలెంట్ అయ్యారు.
స్థానిక టీడీపీ నేతలను నిలదీస్తున్న ఉద్యోగులు?
పైగా అమరరాజా టీడీపీ ఎంపీ గల్లాది. ఫ్యాక్టరీ కార్మికుల కోణంలో కాకున్నా కనీసం పార్టీపరంగా నైనా స్పందించాల్సి ఉంది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ దీన్ని అన్ని వేదికలమీదా ప్రస్తావిస్తోంది. దీన్నో అంశంగా అగ్రనేతలు తీసుకున్నారు. కానీ.. లోకల్ లీడర్స్లో చలనం లేదు. దీంతో ఆ ఇంఛార్జ్లు మాకెందుకు.. ఇప్పుడు అవసరమా అన్నట్టు ఉన్నారట కేడర్. నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. రెండున్నరేళ్లుగా తమ్ముళ్లను వదిలేశారు. ఇప్పుడు సమస్యలను గాలికి వదిలేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారట. గ్రామాల్లో ఉన్న అమరరాజా ఉద్యోగులు ఈ అంశంలో స్థానిక టీడీపీ నేతలను నిందిస్తున్నట్టు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న అంశాలనే క్రోడీకరించి ఇంఛార్జులపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట తెలుగు తమ్ముళ్లు. మరి.. శ్రేణులు ప్రస్తావించిన అంశాలను చంద్రబాబు పట్టించుకుంటారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..