Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల.. మే 2న సుప్రీంకోర్టు విచారణ
బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 2న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యాపిల్ను నారింజ పండ్లతో పోల్చలేమని, అలాగే ఊచకోతను హత్యతో పోల్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. క్షమాపణల ఫైళ్లను చూపకపోవడంపై సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేరం భయంకరమైనదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ బాధిత మహిళ బానో గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2002 గుజరాత్ అల్లర్లలో ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని ఏడుగురు కూడా హత్యకు గురయ్యారు.
Also Read:Atiq Ahmed: గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య.. భార్య షైస్తా పర్వీన్ కుటుంబం పరారీ
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు మినహాయింపులపై కోర్టు ఒరిజినల్ ఫైళ్లను కోరిన మార్చి 27న ఉత్తర్వులపై తాము రివ్యూ దాఖలు చేయవచ్చని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్ మరియు బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం 11 మంది దోషులకు వారి నిర్బంధ కాలంలో మంజూరైన పెరోల్ను ప్రశ్నించింది. నేరం యొక్క తీవ్రతను రాష్ట్రం పరిగణించవచ్చని పేర్కొంది. ఒక గర్భిణిపై సామూహిక అత్యాచారం జరిపి అనేక మందిని చంపారు. ”మీరు బాధితుడి కేసును ప్రామాణిక సెక్షన్ 302 (హత్య) కేసులతో పోల్చలేరు. మీరు యాపిల్ను నారింజతో పోల్చలేనట్లుగా, మారణహోమాన్ని హత్యతో పోల్చలేము” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మినహాయింపు ఇవ్వాలనే దాని నిర్ణయం ఆధారంగా ప్రణాళిక ఏమిటి అనేదే ప్రశ్న,” అని ధర్మాసనం పేర్కొంది. ఈరోజు బిల్కీస్ అని, రేపు ఎవరైనా కావొచ్చు పేర్కొంది.
Also Read:Jagadish Shettar: కర్ణాటక బీజేపీలో టికెట్ల పంచాయతీ… తెర వెనుక ఉన్నది అతనే..
Also Read
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
రివ్యూ పిటిషన్ దాఖలుకు సంబంధించి తమ వైఖరిని స్పష్టం చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. మొత్తం 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం మినహాయింపునిచ్చి, గత ఏడాది ఆగస్టు 15న విడుదల చేసింది. మే 2న దోషులకు ఉపశమనం కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు అభ్యర్థనలను సుప్రీంకోర్టు విచారించనుంది. నోటీసు అందుకోని దోషులందరూ తమ ప్రత్యుత్తరాలు పంపాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!