Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Story Union Finance Minister To Visit Ponduru Srikakulam District

కేంద్రమంత్రి అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలిన నేతలు!

Published Date :August 12, 2021 , 10:14 pm
By ramakrishna
కేంద్రమంత్రి అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలిన నేతలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్రమంత్రి వస్తున్నారని వారంరోజుల ముందు నుంచే హడావిడి చేశారు. బోలుడన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు కూడా. తీరా.. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి వచ్చాక.. లెక్కలు చెప్పలేక తడబడ్డారు. సీనియర్లు అనుకున్నవారే గుడ్లు తేలేశారు.

కేంద్రమంత్రి పర్యటనలో జరిగిన పరిణామాలపై చర్చ!

శ్రీకాకుళం జిల్లాలో ఖద్దరుకు పేరొందిన పొందూరులో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. ఎన్నోఏళ్లుగా ఆదరణ లేకుండా పోయిన పొందూరు ఖాదీ, ఖద్దరు పరిశ్రమకు ఆమె పర్యటనతో దశ తిరిగిపోతుందని భావించారు సిక్కోలు నేతలు, అధికారులు. కేంద్రమంత్రి పర్యటనకు వారంరోజుల ముందునుంచే ఏర్పాట్లుపై ఓ రేంజ్‌లో హడావిడి చేశారు. జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7న నిర్మలా సీతారామన్‌ పొందూరు రావడం.. పర్యటన ముగించుకుని వెళ్లడం అయిపోయింది. సీన్‌ కట్‌ చేస్తే.. కేంద్రమంత్రి పర్యటనలో జరిగిన పరిణామాలే ఇప్పుడు చర్చగా మారాయి.

కేంద్రమంత్రి అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలిన నేతలు!

వచ్చామా.. వెళ్లామా అన్నట్టుగా కాకుండా పొందూరు పర్యటనలో నిర్మలా సీతారామన్ అన్ని అంశాలను నిశితంగా పరిశీలించారు. నేరుగా నేతన్నలతోనే వారి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా చేనేత దినోత్సవ వేడుకల వేదిక నుంచి కేంద్రమంత్రి అడిగిన ప్రశ్నలకు అంతా నీళ్లు నమిలారు. కేంద్రమంత్రికి ఇచ్చిన వివరాల్లో 500 మంది మాత్రమే వీవర్స్ ఉన్నారని ప్రస్తావించారు అధికారులు. 1500 మంది వీవర్స్‌ ఉంటేనే మెగా ఖాదీ క్లస్టర్ ఏర్పాటు సాధ్యమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఆ సమాధానంతో వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు ఉలిక్కి పడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కల్పించుకుని.. పొందూరుతోపాటు చుట్టుపక్కల అంతాకలిపి 2 వేల 500 నుంచి 2 వేల 800 మంది వీవర్స్‌ ఉంటారని బదులిచ్చారు. ఆరువేల రాట్నాలున్నాయని జిల్లా కలెక్టర్ చెప్పారు.

వేదికపైనే సిక్కోలు నేతలు, అధికారులకు కేంద్రమంత్రి చురకలు!

లెక్కల్లో కన్ఫ్యూజన్ పరిశీలించిన తర్వాత జిల్లా నేతలు.. అధికారులపై సెటైర్లు వేశారు కేంద్రమంత్రి. పొందూరు ఖాదీని బతికించాలని అడుగుతున్నప్పుడు సరైన లెక్కలు ఉండాలి కదా? ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ఎలా ప్రశ్నిస్తారో.. అలా ఇక్కడ కూడా నిలదీయాలంటే ముందు మనదగ్గర లెక్కలుండాలి కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు నిర్మలా సీతరామన్‌. ఆ లెక్కలు లేకపోతే ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా తెలుసుకోవాలని వేదికపై ఉన్నవారికి చురకలు వేశారు కేంద్రమంత్రి. ఆ చురకలే అటు పొందూరులో ఇటు జిల్లాలో చర్చగా మారాయి.

కీలక సమయంలో సిక్కోలు నేతలు చేతులు ఎత్తేశారా?

పొందూరు పుట్టుపుర్వోత్తరాలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌లు గొప్పగా చదివి వినిపిస్తే.. ప్రస్తుత పరిస్థితులను ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వేదికపై ఉన్నవారు..సభకు వచ్చిన వారు విపక్ష ఎంపీ వెల్లడించిన చిట్టాకు చప్పట్లు కొట్టలేకుండా ఉండిపోయారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో సైతం కేంద్రమంత్రే స్వయంగా పేర్లు అడిగి తెలుసుకుని.. వాటిని అందజేశారు. సమన్వయం లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇంత కాదు.. అంతకాదు అని గొప్పులు చెప్పే సిక్కోలు నేతలు… అధికారులు సమయం వచ్చినప్పుడు చేతులెత్తేశారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కేంద్రమంత్రి సమక్షంలో డొల్లతనం తెలిసిపోయింది. దీంతో … ఓస్ ఈ మాత్రం దానికేనా అంత హడావిడి అని చెవులు కొరుక్కుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Nirmal Sitharaman
  • Ponduru
  • Special Story
  • srikakulam district

తాజావార్తలు

  • Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.174 కోట్లు తిరిగి చెల్లింపు

  • Off The Record : కాంగ్రెస్ నేత ప్రపోజల్ విని కేటీఆర్ షాక్?

  • Off The Record: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?

  • Deve Gowda: కాంగ్రెస్‌తో అందుకే విడాకులు.. ఖర్గే పంచ్‌లపై దేవెగౌడ కౌంటర్

  • Hyderabad: ఇలా చేస్తుంటే సిలిండర్ల కొరత ఎందుకు రాదు? భారీ దందా!

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions