ఎమ్మెల్యే వాసుపల్లిపై వైసీపీ కార్పొరేటర్ల గుర్రు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి అధికారపార్టీ పంచన చేరారు. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అసమ్మతి ఆరునొక్క రాగం అందుకుందట. దీంతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ఎలా బయటపడతారోననే చర్చ మొదలైంది.
వాసుపల్లి పార్టీ మారినా వైసీపీలో పెద్దగా మార్పు లేదట!
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ పవర్లో ఉన్నప్పుడు వైసీపీపై చింతనిప్పులు తొక్కేవారు. 2019 సీన్ రివర్స్. అప్పటి వరకు అనుభవించిన పవర్ ప్రభావవో ఏమో.. టీడీపీని కాదని వైసీపీకి జై కొట్టేశారు. అర్ధరాత్రి నిర్ణయంతో అనూహ్యంగా పార్టీ ఫిరాయించారు గణేష్ కుమార్. ఎమ్మెల్యే రాకతో విశాఖ సిటీ పరిధిలో బలం పెరుగుతుందని అంచనా వేసింది వైసీపీ. కానీ, వాసుపల్లి చేరడానికి ముందు తర్వాత పెద్దగా మార్పులు ఏమీ లేవన్నది వైసీపీ వర్గాల వాదన.
టీడీపీ నుంచి వచ్చినవారికి, వైసీపీ కేడర్కు పొసగడం లేదట
కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేకు మధ్య నిత్యం వార్!
విశాఖ సౌత్లో మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు.. మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్కు వర్గాలు ఉన్నాయి. వీరంతా చాలాకాలంగా వైసీపీతో అనుబంధం కలిగి ఉన్నవాళ్లే. ఎమ్మెల్యే వాసుపల్లితోపాటు కొంత టీడీపీ కేడర్ అధికారపార్టీలోకి వచ్చింది. ఎంత ప్రయత్నించినా పాతనీరు-కొత్తనీరు మధ్య పొంతన కుదరలేదు. జీవీఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వ్యూహాలు ఫలించలేదు. టీడీపీ, వైసీపీ రెబల్స్ ఎక్కువ స్ధానాలు దక్కించుకున్నారు. ఎన్నికల తర్వాత దక్షిణ నియోజకవర్గంలో అంతర్యుద్ధం బాగా పెరిగింది. ఇండిపెండెంట్లుగా గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు సిద్ధిఖ్, భాస్కరరావు, నాగరాజులు వైసీపీ కండువాలు కప్పుకొన్నారు. వీరంతా ముందు నుంచి వైసీపీలోనే ఉన్నారు. పార్టీ టిక్కెట్లు నిరాకరించడానికి ఎమ్మెల్యే కారణమనేది బలమైన వాదన. అందుకే ఎమ్మెల్యే వెర్సస్ కార్పొరేటర్లు అన్నట్టుగా కొన్నిరోజులుగా అంతర్యుద్ధం జరుగుతోంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
జీవీఎంసీ కమిషనర్పై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
ఎమ్మెల్యేపై సీఎంకు ఫిర్యాదు చేసిన జీవీఎంసీ కమిషనర్
తాజాగా ఎంవీడీఎం స్కూల్ దగ్గర అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ తొలగించింది. మత్తుపదార్ధాల విక్రయాలు సహా పిల్లలకు ఇబ్బంది కలిగించే వాతావరణం ఉండటంతో షాపులను తీసేశారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే వ్యక్తిగతంగా తీసుకున్నారట. కమిషనర్ సృజనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వొద్దని సీఎంకు ఫిర్యాదు చేస్తానని వాసుపల్లి హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన కమిషనర్.. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సీఎం కార్యాలయానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారట. ఇంతలో వాసుపల్లిని వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్లు కూడా కోరస్ అందుకోవడంతో రగడ ఆసక్తిగా మారింది.
ఎమ్మెల్యే సంధించిన అస్త్రం మిస్ఫైర్!
రెండు గ్రూపుల మధ్య నెలకొన్న విభేదాలు ఎంవీడీఎం స్కూల్ దగ్గర షాపుల తొలగింపుతో తారస్థాయికి చేరుకున్నాయి. ప్రెస్మీట్ పెట్టి మరీ వాసుపల్లిని కడిగిపారేసింది కార్పొరేటర్ల త్రయం. కమిషనర్ లక్ష్యంగా ఎమ్మెల్యే సంధించిన అస్త్రం మిస్ఫైర్ అయిందనే చర్చ మొదలైంది. అయితే వర్గాలుగా విడిపోయి.. కొట్లాటకు దిగి.. పరువును బజారుకీడుస్తున్నారనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో కలుగుతోందట. మరి.. ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తారో లేదో చూడాలి.
- Tags
- ap
- ap mla
- tdp
- vasupalli ganesh kumar
- ycp
తాజావార్తలు
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!