మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ మళ్లీ పార్టీ మారతారా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన ఆ మాజీ ఎమ్మెల్యే మనసు మార్పు కోరుకుంటుందా? బ్యాక్ టు పెవీలియన్ అని వచ్చేస్తారా? అనుచరుల మాటేంటి? మాజీ ఎమ్మెల్యే మాట వింటారా? రాం రాం చెబుతారా? ఇదే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో ఆసక్తిగా మారింది.
కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్వైపు చూస్తున్నారా?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
బీజేపీలో రాజకీయ భవిష్యత్ వెతుక్కుంటూ వెళ్లిన చాలా మంది కాంగ్రెస్ నాయకులు తిరిగి వెనక్కి వచ్చేయడానికి చూస్తున్నరనే చర్చ తెలంగాణలో జోరందుకుంది. ఇప్పటికే కొందరు బీజేపీకి గుడ్బై చెప్పి కొత్త పీసీసీ చీఫ్తో టచ్లోకి వెళ్లారు. మరికొందరు కూడా ఆ దారిలో వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రచారంలోకి వస్తున్న పేర్లు గులాబీ శిబిరాన్ని కలవరపెడుతున్నాయి. ఆ జాబితాలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పేరు కూడా వినిపిస్తోంది.
కమలం శిబిరంలో ఇమడ లేకపోతున్నారా?
గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కూన శ్రీశైలం గౌడ్ చాలా కాలంపాటు హస్తంపార్టీ నీడలో ఉన్నారు. అయితే కాలం కలిసి రావడం లేదని అనుకున్నారో ఎమో.. బీజేపీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నికలో ఒక మండలానికి బీజేపీ ఇంచార్జ్గా కూడా ఉన్నారు. మెడలో కాషాయ కండువా ఉన్నా.. మనసులో మాత్రం ఏదో వెలితి ఉండిపోయిందట. కమలం శిబిరంలో ఆయన ఇమడ లేకపోతున్నట్టు సమాచారం. అసంతృప్తితో ఉన్నారట. ఈలోగా తెలంగాణలో పీసీసీ పగ్గాలు మారడంతో కాంగ్రెస్లోకి వెనక్కి వెళ్లితే ఎలా ఉంటుందో అని ఆలోచన చేస్తున్నారట.
కూన అనుచరులు ఆయన మాట వినడం లేదా?
అనుచరుల తీరుపై కూన శిబిరంలో ఆందోళన
తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లితే ఒక్కడిగా కాకుండా.. అనుచరులను తీసుకుని వెళ్లి చేరాలని కూన అనుకుంటున్నట్టు ఆయన వర్గం చెబుతోంది. అయితే కూన అనుచరులుగా ముద్ర పడ్డ కొందరు నాయకులు… స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆయన మాట వినడం లేదని సమాచారం. ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్న అనుచరులు కొందరు కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వెళ్తామని చెబుతున్నారట. దీంతో కూనకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఈ విధంగా టచ్మీ నాట్ అన్నట్టుగా కూనతో ఉంటున్న వారిలో ప్రధాన అనుచరుల పేర్లు వినిపిస్తుండటంతో మాజీ ఎమ్మెల్యే శిబిరం ఆందోళనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ పరిణామాల తర్వాత బీజేపీని వీడి కాంగ్రెస్లోకి ఒంటరిగా వెళ్లడమా లేదా అని మథన పడుతున్నారట శ్రీశైలం గౌడ్. కేడర్ వెంట రాకపోతే క్షేత్రస్థాయిలో బలం ఉండదు. వెళ్లే పార్టీలోనూ తగిన గుర్తింపు ఇస్తారో లేదో అనుమానాలు ఉంటాయి. మరి.. బ్యాక్ టు పెవీలియన్ విషయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎలాంటి ఎత్తుగడ వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!