PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- యువతపై ప్రత్యేక దృష్టి
- రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
- కేబినెట్ సమావేశంలో ప్రధాని మోడీ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెన్-జీ యువతతో మరింత మమేకమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోజుకో యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై మంత్రివర్గ సమావేశంలో మోడీ ప్రత్యేకంగా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read
- Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
- Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
దేశంలోని ఒక్కో యూనివర్సిటీకి రోజుకో కేంద్ర మంత్రిని పంపించి.. విద్యార్థులతో నేరుగా సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు.. వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’
‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ ఒక కేంద్ర మంత్రి కేటాయించిన యూనివర్సిటీని సందర్శిస్తారు. విద్యార్థులతో నేరుగా సమావేశమై వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. వారి సమస్యలు, ఆలోచనలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై యువత అభిప్రాయాలను స్వయంగా వింటారు. అదే సమయంలో యువత, విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వారికి వివరిస్తారు.
ఇద్దరికి బాధ్యతలు
ఈ కార్యక్రమం కోసం యూనివర్సిటీలతో, ఆయా పర్యటనలకు వెళ్లే కేంద్ర మంత్రులతో సమన్వయం చేసే బాధ్యతలను విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు అప్పగించినట్లు తెలుస్తోంది. బుధవారం మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దేశంలో 1,300 యూనివర్సిటీలు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 1,300 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 57 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 522 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మిగిలినవి డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలుగా ఉన్నాయి. దీంతో ‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’ కార్యక్రమం ద్వారా భారీ సంఖ్యలో విద్యార్థులను నేరుగా కలిసే అవకాశం కేంద్ర మంత్రులకు లభించనుంది.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో..
దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు నిరసనలు చేపట్టడంతో పాటు.. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ స్థానికంగా విద్యార్థుల ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ అంశంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆందోళనకు దిగాయి.
యువతపై ప్రత్యేక దృష్టి
విద్యార్థుల ఆందోళనల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ కూడా పలుమార్లు సోషల్ మీడియా వేదికగా యువతతో మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ యువతకు సంబంధించిన పలు కీలక కార్యక్రమాలను ప్రకటించారు. ఉచిత ఆన్లైన్ కోచింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్కిల్లింగ్ ప్రోగ్రామ్, క్రీడా ప్రతిభను గుర్తించే కార్యక్రమం, సివిల్ డిఫెన్స్ నెట్వర్క్ను విస్తరించడం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. తయారీ, అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో యువతకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!