Tamil Nadu: తమిళనాట బిల్లుల గొడవ.. గవర్నర్ పై డీఎంకే కీలక తీర్మానం
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. తాజాగా తమమిళనాడు గవర్నర్ రవి తీరుపై అధికార డీఎంకే నాయకులు విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ రవి చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Karnataka: ట్విట్టర్ ఖాతాల బ్లాక్ కు కారణమేంటి?.. కేంద్రానికి హైకోర్టు ప్రశ్న
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ టీఎన్ రవి మధ్య అనేక సమస్యలపై వాగ్వాదం చోటుచేసుకోవడంతో, డీఎంకే సీనియర్ మంత్రి దురై మురుగన్ అసెంబ్లీలో గవర్నర్పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేందుకు గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
సభా వేదికపై భారమైన హృదయంతో, ముఖ్యమంత్రి తమ పార్టీకి ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారని మంత్రి దురై మురుగన్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో గందరగోళం తలెత్తడానికి గవర్నర్లు కారణమనే అంశాన్ని ఆయన ఎత్తి చూపారు. ఆ పదవి ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తుందన్నారు. గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న తరుణంలో, మీరు భారత పౌరుడిగా ఉండటానికి అర్హులు కాదన్నారు. మీకు రాజకీయ భావజాలం ఉంటే నిష్క్రమించండి అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. కావాలంటే బీజేపీలో చేరవచ్చు అంటూ గవర్నర్పై మంత్రి మండిపడ్డారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై కూర్చునే అవకాశం గవర్నర్కు రాజ్యాంగం కల్పించలేదన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనేది నా అభిప్రాయం అని డీఎంకే మంత్రి పేర్కొన్నారు.
Also Read: Nirmala Sitharaman: భారత్ లో ముస్లింల జనాభా అధికం.. పాకిస్థాన్ కంటే మనమే టాప్
బిల్లులను ఆమోదించేందుకు రాష్ట్రాల గవర్నర్లకు గడువును నిర్ణయించాలని కేంద్రం, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానంపై సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గవర్నర్ రవి చర్యలపై విమర్శలు చేశారు. గవర్నర్ రవి రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని ఆరోపించారు. ఆయన కోరిక మేరకు బిల్లును నిలుపుదల చేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని సీఎం స్టాలిన్ అన్నారు. రాష్ట్రపతిని అభిశంసించే అధికారం పార్లమెంటుకు ఉన్నట్లే, గవర్నర్కు అసెంబ్లీకి అలాంటి అధికారాలు కల్పించడంపై గతంలో చర్చ జరిగిందని సిఎం సూచించారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో