Tamil Nadu: తమిళనాట బిల్లుల గొడవ.. గవర్నర్ పై డీఎంకే కీలక తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. తాజాగా తమమిళనాడు గవర్నర్ రవి తీరుపై అధికార డీఎంకే నాయకులు విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ రవి చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Karnataka: ట్విట్టర్ ఖాతాల బ్లాక్ కు కారణమేంటి?.. కేంద్రానికి హైకోర్టు ప్రశ్న
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ టీఎన్ రవి మధ్య అనేక సమస్యలపై వాగ్వాదం చోటుచేసుకోవడంతో, డీఎంకే సీనియర్ మంత్రి దురై మురుగన్ అసెంబ్లీలో గవర్నర్పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపేందుకు గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
సభా వేదికపై భారమైన హృదయంతో, ముఖ్యమంత్రి తమ పార్టీకి ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారని మంత్రి దురై మురుగన్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో గందరగోళం తలెత్తడానికి గవర్నర్లు కారణమనే అంశాన్ని ఆయన ఎత్తి చూపారు. ఆ పదవి ప్రభుత్వానికి ఆటంకం కలిగిస్తుందన్నారు. గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న తరుణంలో, మీరు భారత పౌరుడిగా ఉండటానికి అర్హులు కాదన్నారు. మీకు రాజకీయ భావజాలం ఉంటే నిష్క్రమించండి అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ వ్యాఖ్యానించారు. కావాలంటే బీజేపీలో చేరవచ్చు అంటూ గవర్నర్పై మంత్రి మండిపడ్డారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై కూర్చునే అవకాశం గవర్నర్కు రాజ్యాంగం కల్పించలేదన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనేది నా అభిప్రాయం అని డీఎంకే మంత్రి పేర్కొన్నారు.
Also Read: Nirmala Sitharaman: భారత్ లో ముస్లింల జనాభా అధికం.. పాకిస్థాన్ కంటే మనమే టాప్
బిల్లులను ఆమోదించేందుకు రాష్ట్రాల గవర్నర్లకు గడువును నిర్ణయించాలని కేంద్రం, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానంపై సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గవర్నర్ రవి చర్యలపై విమర్శలు చేశారు. గవర్నర్ రవి రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని ఆరోపించారు. ఆయన కోరిక మేరకు బిల్లును నిలుపుదల చేసి తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని సీఎం స్టాలిన్ అన్నారు. రాష్ట్రపతిని అభిశంసించే అధికారం పార్లమెంటుకు ఉన్నట్లే, గవర్నర్కు అసెంబ్లీకి అలాంటి అధికారాలు కల్పించడంపై గతంలో చర్చ జరిగిందని సిఎం సూచించారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!