బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ- ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జునరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతులకు రెండున్నర లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీఎస్ఆర్టీసీ. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్టీవీతో ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి మాట్లాడారు. బస్సు ఘటనకు సంబంధించి విచారణ జరుగుతుందని.. ఇప్పటికే దీనిపై కమిటీ వేశాం అన్నారు.
డ్రైవర్ హెల్త్ కండిషన్, బస్సులో లోపాలున్నాయన్న దానిపై కమిటీ విచారణ జరుపుతుందన్నారు. గ్యారేజి నుంచి బస్సు బయటకు వెళ్ళేటప్పుడే బస్ కండీషన్ చెక్ చేసి పంపుతారు. గతంలో స్టీరింగ్ లోపం అని ఎటువంటి కంప్లైంట్ రాలేదు. డ్రైవర్ కెరియర్ లో ఒక్కసారి కూడా బస్సు ఢీకొట్టినట్లు ఇతరత్రా ఫిర్యాదులు లేవు. నిన్న ఏం జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నాం అన్నారు. ఆర్టీసీ సంస్ధ తరపున మృతుల కుటుంబాలకు రెండున్నర లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందిస్తున్నాం అన్నారు.
Also Read
గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. డ్రైవర్ కు ఆర్టీసీ నుంచి అందాల్సిన అన్ని బెనిఫిట్స్ ఆయన కుటుంబ సభ్యులకు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు మల్లిఖార్జున రెడ్డి. ఇకపై ఇలాంటి ప్రమాదలు జరగకుండా మరింత అప్రమత్తం చేస్తాం అన్నారు.
తాజావార్తలు
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!