Robert Vadra: ల్యాండ్ డీల్ కేసులో క్లీన్ చిట్.. నిజాయితీగా పనిచేశానన్న సోనియా అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ల్యాండ్ డీల్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబర్ట్ వాద్రా సంస్థ రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు భూమిని బదలాయించడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపత్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా భర్త సుదీర్ఘ ఫేస్బుక్ పోస్ట్లో సంతోషంగా ఉన్నానని అన్నారు. “నేను ఎప్పుడూ నిజాయితీగా పనిచేశాను,కష్టపడి అభివృద్ధి చెందాను. కానీ బిజెపి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తోంది. వారి ఏజెన్సీలు నా కంపెనీలపై దాడులు చేశాయి. వారు నన్ను రోజుల తరబడి ప్రశ్నించారు, 100ల నోటీసులు పంపారు, చట్టవిరుద్ధమైన పన్ను డిమాండ్లు చేశారు. నా ఆస్తులను అటాచ్ చేస్తారు. 20,000 డాక్యుమెంట్లకు పైగా తీసుకుంటారు. నేను పూర్తిగా సహకరిస్తూనే ఉన్నాను. నన్ను అడిగిన మొత్తం సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాను ”అని వాద్రా పోస్ట్లో తెలిపారు.
వ్యాపారాన్ని నిర్వహించడం, అన్ని పన్నులు చెల్లించడం వంటి చట్టబద్ధమైన పద్ధతులకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. తన వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి తప్పుడు పనులు జరగలేదని హర్యానా ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆశాకిరణం కనిపించడం ఆనందంగా ఉంది అని వాద్రా చెప్పారు. ఇది మరెవరికీ జరగదని నేను ఆశిస్తున్నానని, ప్రతీకార రాజకీయాల పద్ధతి దేశానికి విషపూరితం అని వాద్రా వ్యాఖ్యానించారు.
Also Read:Ice Cream Crime: ఐస్‘క్రైమ్’ స్టోరీ.. బాలుడు మృతి.. కేసులో షాకింగ్ నిజాలు
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
కాగా, వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ డిఎల్ఎఫ్కు భూమిని బదిలీ చేయడంలో ఎలాంటి నియమాలు లేదా నిబంధనలను ఉల్లంఘించలేదని హర్యానా ప్రభుత్వం బుధవారం పంజాబ్, హర్యానా హైకోర్టుకు తెలిపింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, వాద్రా మరికొందరిపై 2018 సెప్టెంబర్లో గురుగ్రామ్లో నమోదైన ఎఫ్ఐఆర్తో దర్యాప్తు ముడిపడి ఉంది. అయితే, ఈ డీల్ సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల రికార్డును హర్యానా పోలీసులు పరిశీలిస్తున్నారు. భూమి లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నుహ్ నివాసి సురీందర్ శర్మ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాము ఎప్పుడూ తప్పు చేయలేదని మాజీ సీఎం హుడా, వాద్రా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!