PM Modi: కేరళలో తొలి వందే భారత్.. నేడు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో తొలి వందే భారత్ రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళలోని కొచ్చిలో నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్షో నిర్వహించారు. ఇక, పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3200 కోట్ల రూపాయల విలువైన బహుళ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
Also Read:YS Sharmila : వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్
తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ సహా 11 జిల్లాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య దూరం 501 కి.మీ. ఇది అనేక నీటి వనరులు, పశ్చిమ కనుమలతో సహా కొన్ని సుందరమైన ప్రదేశాల గుండా వెళుతుంది. భారతదేశం అంతటా దాదాపు 14 వందే భారత్ రైళ్లు నడపబడుతున్నాయి. దీని మొదటి సర్వీస్ ఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రారంభమైంది. దీని 15వ సర్వీసు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. దేశంలోనే తొలి డిజిటల్ సైన్స్ పార్కుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,500 కోట్ల ప్రాజెక్ట్ డిజిటల్ టెక్నాలజీలపై దృష్టి సారించే మల్టీడిసిప్లినరీ క్లస్టర్ ఆధారిత ఇంటరాక్టివ్-ఇన్నోవేషన్ జోన్గా ఉంటుంది. రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్నారు.
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!