PM Modi: కేరళలో తొలి వందే భారత్.. నేడు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో తొలి వందే భారత్ రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళలోని కొచ్చిలో నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్షో నిర్వహించారు. ఇక, పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3200 కోట్ల రూపాయల విలువైన బహుళ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
Also Read:YS Sharmila : వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్
తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ సహా 11 జిల్లాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య దూరం 501 కి.మీ. ఇది అనేక నీటి వనరులు, పశ్చిమ కనుమలతో సహా కొన్ని సుందరమైన ప్రదేశాల గుండా వెళుతుంది. భారతదేశం అంతటా దాదాపు 14 వందే భారత్ రైళ్లు నడపబడుతున్నాయి. దీని మొదటి సర్వీస్ ఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రారంభమైంది. దీని 15వ సర్వీసు తిరువనంతపురం నుండి కాసరగోడ్ వరకు నడుస్తుంది. దేశంలోనే తొలి డిజిటల్ సైన్స్ పార్కుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,500 కోట్ల ప్రాజెక్ట్ డిజిటల్ టెక్నాలజీలపై దృష్టి సారించే మల్టీడిసిప్లినరీ క్లస్టర్ ఆధారిత ఇంటరాక్టివ్-ఇన్నోవేషన్ జోన్గా ఉంటుంది. రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్నారు.
Also Read
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!