ఒక పార్టీ.. రెండు ధృవాలు..!
సాధారణంగా ఒక పార్టీకి ఏ అంశం పైన అయినా ఒకటే విధానం వుంటుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా.. పార్టీలో ఏ పదవిలో వున్నవారైనా వాయిస్ ఒకటే వుంటుంది. కానీ అదేంటో ఏపీలో బీజేపీలో మాత్రం ఒకే అంశంపై రెండురకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ వుంటాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు దగ్గర్నించి రాజ్యసభ ఎంపీ జీవీఎల్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వరకూ వివిధ రకాల అభిప్రాయాలు కనిపిస్తాయి. అనేకసార్లు జీవీఎల్, సోము వాయిస్ ఒకేలా వుంటుంది. వైసీపీయేతర పార్టీలు అధికార పార్టీని విమర్శిస్తే.. బీజేపీలోని ఒక వర్గం మాత్రం వారికి ఇబ్బంది కలగకుండా విమర్శల బాణాలు సంధిస్తూ వుంటారు. మిగిలిన నేతలు అంటే పురందేశ్వరి గానీ, సుజనా చౌదరి గానీ వైసీపీపై తనదైన రీతిలో విమర్శలు చేస్తారు.
ఏపీలో మంగళవారం, బుధవారం జరిగిన పరిణామాలపై బీజేపీ నేతలు స్పందించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం దృష్టి పెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో, అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. గతంలో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారని జీవీఎల్ గుర్తుచేశారు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
సీబీఐకి కూడా చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడలేదని.. అలాంటిది ఇప్పుడెలా మాట్లాడతారని మండిపడ్డారు జీవీఎల్. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తారని జీవీఎల్ నిలదీశారు. గతంలో ఏపీలో చోటుచేసుకున్న అనుభవాలను టీడీపీ మరిచిపోయినా బీజేపీ ఇంకా మరిచిపోలేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గతంలో చేసిన తప్పులను చంద్రబాబు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదంతా ఒక ఎత్తయితే …నిత్యం వైసీపీని అంతగా విమర్శించని సోము వీర్రాజు సైతం ఈసారి రొటీన్కి భిన్నంగా స్పందించడం విశేషం. ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు చాలా విషాదకరమన్నారు. పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దుశ్చర్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.
చంద్రబాబు వదిన, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి వైఖరి జీవీఎల్కు భిన్నంగా వుంది. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులను పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. వైస్సార్సీపీ కార్యకర్తల గూండాయిజాన్ని నేను ఖండిస్తున్నాను….విమర్శలను తట్టుకునే మనస్థైర్యం నాయకుడికి ప్రజాజీవితంలో ఉండాలి. విమర్శకు దాడులు జవాబు కాదు.ప్రజాస్వామ్యంలో గొంతులు అణచివేయలేరు.. అంటూ సోషల్ మీడియా వేదికగా తన గళాన్ని వినిపించారు.
మరో బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుజనా చౌదరి కూడా తన అభిప్రాయం వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు,నేతల ఇళ్లపై దాడులు చేయడం గర్హనీయం. ప్రశ్నిస్తే సహించమనడం ఫ్యాక్షన్ భావజాలం. దాడులు చేసినవారిపై పోలీసుల కఠిన చర్య తీసుకోవాలి. వైసిపి నేతల పాత్ర ఉంటే వారిపై సీఎం జగన్ చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ వైఎస్ చౌదరి ట్వీట్ చేశారు. దీనిని బట్టి గమనిస్తే చంద్రబాబు విషయంలో ఒక పార్టీ నుంచే రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం కావడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఏపీలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను వివరించేందుకు శనివారం నాడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను చంద్రబాబు కలిసే అవకాశాలున్నాయి. అయితే, చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసే అవకాశం వుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో