Bandi Sanjay : నిరుద్యోగ భృతి హామీ..ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిరుద్యోగ భృతి హామీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. “నిరుద్యోగ యువతకు రూ.3016 భృతి ఇస్తాం – సీఎం కేసీఆర్. మీరు దానిని విశ్వసిస్తే, ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు! ” అంటూ బండి సంజయ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Also Read: Tension in Puttaparthi: పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ను టార్గెట్ చేసేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ తాజాగా ట్వీట్ చేశారు.
Also Read
- Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
- Trump: ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు.. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Unemployed youth will be given ₹3016 allowance – CM KCR
If you believed that Happy April Fools Day ! pic.twitter.com/059hKD8osw
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 1, 2023
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) రెండోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి పథకం హామీని కేసీఆర్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,016 అందించడమే ఈ పథకం లక్ష్యం. నిరుద్యోగ భృతి పథకంతో సహా కేసీఆర్ వాగ్దానాలను బీజేపీ నిరంతరం లక్ష్యంగా చేసుకోవడం రాబోయే ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పొందాలనే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.
Also Read: ED raids in Hyderabad: హైదరాబాద్లో ఈడీ సోదాలు కలకలం..
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపొందేందుకు బీజేపీ ఏ అవకాశాన్ని వదలడం లేదు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో సరిపెట్టుకోగా, బీజేపీ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అనంతరం జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయం సాధించింది. దీంతో అసెంబ్లీ బీజేపీ బలం మూడుకు పెరిగింది.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
-
Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి ‘మైఖేల్’ బయోపిక్!
ట్రెండింగ్
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!